కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు ముగుస్తున్న కూడా ఇప్పటికీ అంతం అవ్వలేదు. అయితే తాజాగా కొన్ని ప్రదేశాలలో కరోనా మహమ్మారి అంతకంతకు రెట్టింపు అవుతోంది. చాలా మంది ప్రజలు కరోనా తగ్గుముఖం పట్టిందని కోవిడ్ రూల్స్ ను పాటించడం లేదు.ఇంకొంతమంది అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకదని భావిస్తున్నారు.
ఇది తప్పు అంటూ తాజాగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘోబ్రేయేసస్ తెలిపారు. ఐరోపా అంతటా covid19 కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు.మాస్క్ లు ధరించడం వల్ల ప్రాణాలు కాపాడటంతో పాటు తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్-19 రాదు అనే తప్పుడు భద్రతా భావం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. టీకాలు ప్రాణాలను కాపాడతాయి, అంతే కానీ అవి కరోనాను పూర్తిగా అడ్డుకోవు..అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ 19 వేరియంట్ గురించి చర్చించడానికి WHO తాజాగా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.
అయితే అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కరోనా వైరస్ జాతి కనిపించడంపై UK శాస్త్రవేత్తలు హెచ్చరించారని UK మీడియా నివేదికలు తెలిపాయి. అన్ని ఇతర COVID-19 వేరియంట్ల కంటే స్ట్రెయిన్ స్పైక్ ప్రోటీన్లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్ వార్తా సంస్థ నివేదించింది. దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది. విదేశాలలో మరొకసారి కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిని తప్పకుండా టెస్టింగ్ చేయాలని నిర్ణయించింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…