కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు ముగుస్తున్న కూడా ఇప్పటికీ అంతం అవ్వలేదు. అయితే తాజాగా కొన్ని ప్రదేశాలలో కరోనా మహమ్మారి అంతకంతకు రెట్టింపు అవుతోంది. చాలా మంది ప్రజలు కరోనా తగ్గుముఖం పట్టిందని కోవిడ్ రూల్స్ ను పాటించడం లేదు.ఇంకొంతమంది అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకదని భావిస్తున్నారు.
ఇది తప్పు అంటూ తాజాగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘోబ్రేయేసస్ తెలిపారు. ఐరోపా అంతటా covid19 కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు.మాస్క్ లు ధరించడం వల్ల ప్రాణాలు కాపాడటంతో పాటు తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్-19 రాదు అనే తప్పుడు భద్రతా భావం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. టీకాలు ప్రాణాలను కాపాడతాయి, అంతే కానీ అవి కరోనాను పూర్తిగా అడ్డుకోవు..అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ 19 వేరియంట్ గురించి చర్చించడానికి WHO తాజాగా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.
అయితే అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కరోనా వైరస్ జాతి కనిపించడంపై UK శాస్త్రవేత్తలు హెచ్చరించారని UK మీడియా నివేదికలు తెలిపాయి. అన్ని ఇతర COVID-19 వేరియంట్ల కంటే స్ట్రెయిన్ స్పైక్ ప్రోటీన్లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్ వార్తా సంస్థ నివేదించింది. దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది. విదేశాలలో మరొకసారి కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిని తప్పకుండా టెస్టింగ్ చేయాలని నిర్ణయించింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…