Ex IPS Narasaiah : ప్రతిపక్షాలు చంద్రబాబును విమర్శించాలంటే వెన్నుపోటు అనే అంశాన్ని తెరమీదకు తెస్తారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నావ్ అంటూ మాట్లాడుతారు. అయితే అందులో నిజానిజాలు అప్పటి నాయకులకు తప్ప నేటి తరానికి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఎన్టీఆర్ పార్టీని లక్ష్మి పార్వతి చేతిలో పెడుతున్న సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీని కాపాడాడు అంటూ మరో వెర్షన్ మనకు వినిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాల మీద ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన నరసయ్య గారు ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రాజ్యాంగేతర శక్తిగా…
ఎన్టీఆర్ గారు బోలా మనిషి, ఆయన గురించి దగ్గగరగా తెలిసిన వ్యక్తులెవరైనా చెప్పే మొదటి మాట. ఆయన పొగడ్తలకు పడిపోతారంటూ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన నరసయ్య గారు తెలిపారు. ఆయనని పొగిడి పనులు జరుపుకోవాలని చాలా మంది చూస్తుంటారని చెప్పారు. ఇక ఆయన జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక ఆయనకు సేవలు చేయడానికి వచ్చానంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టింది అంటూ నరసయ్య తెలిపారు. టీడీపీ శ్రేణుల్లో చాలా మంది నాయకులకు ఆమె జోక్యం నచ్చలేదు. ఎన్టీఆర్ కి అనుకూలంగా ఇదే కొంతమంది మినహాయించి దాదాపు 160 మందికి పైగా ఎమ్మెల్యే లు, అశోక్ గజపతిరాజు దేవేందర్ గౌడ్ వంటి నాయకులను ఎన్టీఆర్ తో ఈ విషయం గురించి మాట్లాడటానికి పంపించగా భార్య రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోరాదు అంటూ ఆయన వాదించి వారిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలనుకున్నారు అంటూ తెలిపారు.
అలాంటి సమయంలో పార్టీని కాపాడుకోడానికి అందరూ కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. తప్పని పరిస్థితుల్లోనే ఆయన పార్టీ తీసుకున్నారు. ఇక వైశ్రాయ్ హోటల్ లో జరిగిన ఇష్యూలో కూడా లక్ష్మి పార్వతి అక్కడికి రాకుండా ఉండుంటే పార్టీ పక్కకి పోయేది కాదు ఆ సంఘటన జరిగేది కాదు. ఆ చెప్పులు వేసింది కూడా ఆయన మీద కాదు అంటూ చెప్పారు నరసయ్య. రెండు సార్లు చంద్రబాబు పార్టీని కాపాడారు. నాదెండ్ల ఎపిసోడ్ లో కాంప్ రాజకీయాలు చేసినపుడు ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ కి తీసుకువచ్చినపుడు కూడా చంద్రబాబు కీలక పాత్ర వహించారు. ఆ నాడు చంద్రబాబు సరిగా చూసుకోకపోయుంటే పార్టీనే ఉండేది కాదు అంటూ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…