Etela Rajender
ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్లో గెలుపు కోసం కేసీఆర్ ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎన్ని ప్రలోభాలకు పెట్టిన నియోజకవర్గ ప్రజలు తనవెంటే ఉంటారన్నారు. నిరుద్యోగ భృతి, దళితులందరికి దళిత బంధు పథకం అమలుచేయాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో స్వల్ప అస్వస్థతతకు గురైనా ఈటల వైద్యుల సూచన మేరకు అపోలో ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్న రాజేందర్ ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. తనకు మెరుగైన వైద్యం అందించిన అపోలో ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిశ్చార్జి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్పై విమర్శలు చేశారు. తెరాసలో తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగయి ఉద్యమ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మండిపడ్డారు. ఉద్యమకారులపై రాళ్లు రువ్విన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…