ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. ఈ క్రమంలోనే ఈ మాధ్యమాలకు మిలియన్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ విధమైన సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఒక పిడుగులాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
సామాజిక మాధ్యమాలైనా ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ బ్యాన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో నెటిజన్లు అందరూ కాస్త కంగారు పడ్డారు. అయితే ఎవరు కంగారు పడాల్సిన పని లేదని, ఈ యాప్స్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాన్ అయ్యే పరిస్థితులు లేవని ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు తెలియజేశాయి.
కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను మే 26 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా అమలులోకి వచ్చే కొత్త నిబంధనలను సోషల్ మీడియా దిగ్గజాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను పాటించని నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్స్టా వంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త నిబంధనలను పాటించడానికి ఇప్పటికీ ఫేస్ బుక్, గూగుల్ ఓకే చెప్పడంతో వీటికి ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే ట్విట్టర్ ఈ నిబంధనల గురించి ప్రభుత్వంతో చర్యలు జరుగుతోందని తెలుస్తోంది. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…