Faima: జబర్థస్త్ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫైమా ఆ షోలో తన కామెడీ పంచులు, సెటైర్లతో బాగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని అక్కడ కూడా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు దగ్గర లేడీ కమెడియన్ గా బాగా పాపులర్ అయింది. ఇక జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో పైమా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చాలా కాలం కొనసాగిన ఫైమా ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫైమా పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఫైమా గుర్తింపు పెరగటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆమె నిలదొక్కుకుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫైమా ఎంతో కష్టపడి లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది.
అయితే పైమా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలన్న ఆశతో తల్లితండ్రులను ఒప్పించి ఉన్న ఊరు విడిచి నిలువ నీడలేని స్థితిలో హైదరాబాద్ చేరుకున్న ఫైమా ఇప్పుడు కష్టపడి సొంత ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పారితోషికంతో ఫైమా ఒక ఇంటిని నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ తర్వాత కూడా మాటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోలో ఫైమా సందడి చేస్తూ ఆదాయం పొందుతోంది. అంతేకాకుండా బయట కూడా పలు ఈవెంట్లలో పాల్గొంటూ డబ్బు సంపాదిస్తోంది. ఇలా కష్టపడి పనిచేసి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా పెట్టుకుని సొంత ఇల్లు, కారు సమకూర్చుకొని కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పైమా కూడపెట్టిన ఆస్తుల విలువ కోటి దాకా ఉంటుందని సమాచారం.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…