చేతిలో వీడియో కెమెరా ఉంది కదా.. ఏమైనా చేయోచ్చు అనే ఆలోచనలో ఉంటే ఇలానే బెడిసి కొడుతుంది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెబుతారు. అదేంటంటే.. ‘పులిని దూరం నుంచి చూడాలని అనిపించిందనుకో చూడొచ్చు.. అదే ఫొటో దిగాలని అనిపిస్తే.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు.. కానీ పులితో ఆడుకోవాలని చూస్తే మాత్రం వేటాడేస్తది’ అంటాడు.
డిట్టో ఇక్కడ అదే జరిగింది. నీటిలో ఓ క్రొకోడైల్ ను అతడు గమనించి దగ్గరగా వెళ్లి అతడు వీడియో తీయాలనుకున్నాడు. దగ్గరకు వెళ్తే ఏమైనా ఉందా.. లాగి పట్టి తినేస్తుంది. అలా కాకుండా అతడు ఓ ఉపాయం ఆలోచించారు. దాని దగ్గరకకు ఓ డ్రోన్ కెమెరాను పంపించాడు. దీంతో ఆ ముసలి ఆ డ్రోన్ ఏదో పక్షి అనుకుంది. తన వైపే చూస్తూ.. గాలిలో ఎగురుతుండగా.. తనకు ఏదో ఆపద వచ్చిందని భావించింది.
చూసింది.. చూసింది.. ఒక్కసారిగా ఎగిరి నోటి ద్వారా ఆ డ్రోన్ ను పట్టేసింది. దీంతో కసకస నమిలింది. ఇలా నములుతున్న సమయంలో దాని నోట్లో నుంచి పొగలు వచ్చాయి. అయినా దానిని వదలకుండా నమిలింది. ఇదంతా ఓ వ్యక్తి అక్కడే ఉండి మారో కెమెరాలో బంధించాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఆ వీడియోను ఫ్లోరిడాలో రికార్డు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన డ్రోన్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ క్రిస్ ఆండర్సన్ఈ ఫుటేజీని ముందుగా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను రీట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరులేని జీవాల వద్ద ఇలాంటి ప్రయోగాలు ఆమోదయోగ్యం కాదంటూ ట్వీట్ చేశారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన ట్రెండ్లు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా Instagram వంటి వేదికల్లో “డిటాక్స్ డ్రింక్స్”…
వంటింట్లో నూనె ఎంపిక చిన్న విషయం కాదు. మనం ఏ నూనెతో వంట చేస్తున్నామన్నది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.…
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…