పాఠశాలలు దేశంలోని చాలా రాష్ట్రాలలో మొదలు అయ్యాయి. ఉదయం పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. ఇలా వాళ్లే స్కూల్ వద్ద వదిలి పెట్టి.. మళ్లీ సాయంత్రం వెళ్లి పిక్ అప్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ఓ ఇంట్లో పని ఎక్కువగా ఉండటంతో ఓ తల్లి తన పాపను పాఠశాల వద్ద దింపి రావడానికి ఆ పాపకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని సహాయం అడిగింది.
అలాగే ఆ బాలికను తీసుకెళ్లిన అతడు.. దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మండ్య నగరంలో దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకు ఓ పాప ఉంది. పాఠశాలకు సమయం దగ్గర పడుతుండటంతో.. తనకు వేరే పని ఉందని.. పాపకు బాబాయ్ వరుస అయ్యే 32 ఏళ్ల సల్మాన్ ను సహాయం అడిగింది. అతడు అలాగే అని అక్కడ నుంచి తీసుకెళ్లాడు.
తన అన్న కూతురును పాఠశాలకు తీసుకెళ్లకుండా నేరుగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశారు. సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ బాలికను చూసిన తల్లిదండ్రులు ముఖంపై గాయాలు ఉండటం గమనించారు. ఆ బాలికను గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. ఈ దారుణానికి పాల్పడింది బాబాయ్ అంటూ చెప్పింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని ఆరోజే అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానికంగా మహిళా సంఘం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలిన డిమాండ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…