అనంతపురం: తాడిపత్రి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన స్వస్థలమైన తాడిపత్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన తిరిగి తాడిపత్రిలోకి ప్రవేశించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామంతో పెద్దారెడ్డికి, జేసీకి మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఈ ఆంక్షలను సవాల్ చేస్తూ పెద్దారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తాడిపత్రిలో తిరిగి అడుగుపెట్టారు.
తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పోలీస్ కాన్వాయ్ మధ్య పెద్దారెడ్డి తన స్వగృహానికి చేరుకున్నారు. ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్దారెడ్డికి హారతి ఇచ్చి దిష్టి తీయడం వంటి సంప్రదాయ ఆచారాలతో కుటుంబ సభ్యులు ఆయన రాకను సంతోషంగా స్వాగతించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అయినప్పటికీ, తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…