మన శరీరంలో ఉండే వివిధ అవయవాలు వివిధ పనులను నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే మూత్రపిండాలు నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ వడపోస్తుంటాయి. ఈవిధంగా వడపోత కార్యక్రమంలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను మూత్రాశయం నిల్వ ఉంచుకుని ఉంటుంది. సాధారణంగా మన మూత్రశయం 300 నుంచి 600 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మూత్రాశయం నిండిన తరువాత నాడుల ద్వారా ఈ సమాచారం మన మెదడుకు చేరవేసి మనకు టాయిలెట్ వెళ్లాలనే సమాచారాన్ని పంపిస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
ఈ విధంగా ప్రతి రోజు సుమారుగా ఎనిమిది సార్లు మనం మూత్రాశయానికి వెళితే మనలో ఎటువంటి సమస్య లేదని అర్థం. కానీ కొందరు తరచూ మూత్రాశయానికి వెళుతూ ఉంటారు. ఈ విధంగా మూత్రాశయాన్నికి తరచూ వెళ్లడం వల్ల వారిలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా తరచు మూత్రాశయం రావడానికి గల కారణం మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ కావడం, అధిక శరీర బరువు పెరగడం, అదే విధంగా ఎక్కువ సంతానం కలిగినవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడటం వల్ల తరచూ మూత్రానికి వెళుతూ ఉంటారు.
ఈ విధంగా అతిమూత్ర సమస్య ఉన్నవారు తరచూ టాయిలెట్ కి వెళ్లడం, కొందరిలో మూత్రాశయం లీక్ అవ్వడం, అలాగే కొందరు దగ్గినా,తుమ్మినా, అతిగా నవ్విన వారిలో మూత్రాశయం లీక్ అవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైన సమస్యలు కలిగి ఉన్నవారికి సర్జరీ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ఈ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎక్కువ మూత్రాశయం వెళ్లేవారు రాత్రి సమయంలో వీలైనంత వరకు ద్రవ పదార్థాలను దూరంగా పెట్టడం ఎంతో ఉత్తమం.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పాలు మజ్జిగ లేదా ఏవైనా పండ్లు రసాలను తీసుకోకపోవటం వల్ల కొంతవరకు ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా మన శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అధిక శరీర బరువు కారణంగా మూత్రాశయం పై అధిక ఒత్తిడి పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.అదే విధంగా అధిక ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ మూత్రాశయ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…