అగ్రరాజ్యం అమెరికాలో ఓ బంగారు నాణెన్ని వేలానికి వేశారు. అయితే వేలంపాటలోఈ నాణెం రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంగళవారం న్యూయార్క్ నగరంలో జరిగిన సోథేబై వేలంలో 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణేన్ని వేలానికి వేయగా.. ఈ నాణేన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం ఈ నాణెం విలువ ఏకంగా రూ.142 కోట్ల రూపాయలు.
ఈ విధంగా ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం మాత్రమే కాకుండా, ఈ వేలం పాటలో ప్రపంచంలోనే అరుదైన ఒక స్టాంపు కూడా8.3 డాలర్లు అనగా 61 కోట్ల రూపాయలకి అమ్ముడుపోవడం ఎంతో విశేషం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం వేలంపాటలో సుమారుగా 15 మిలియన్ డాలర్ల వరకు పోతుందని వేలం నిర్వాహకులు భావించగా వారి అంచనాలకు అందకుండా ఏకంగ ఈ నాణెం 19 మిలియన్ డాలర్లు పోవడంతో వారు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వేలంపాటలో అరుదైన స్థాయిలో అమ్ముడుపోయిన ఈ నాణెం ఒక వైపు అమెరికన్ ఈగిల్, మరొకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముద్రించి ఉంటుంది. ఈ విధమైనటువంటి నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అందుకు గల కారణం అప్పట్లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఈ నాణేలను నిషేధించారు. ప్రస్తుతం ఈ నాణెం అత్యధిక స్థాయిలో ఈ వేలం పాటలు అమ్ముడు పోవడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…