అగ్రరాజ్యం అమెరికాలో ఓ బంగారు నాణెన్ని వేలానికి వేశారు. అయితే వేలంపాటలోఈ నాణెం రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంగళవారం న్యూయార్క్ నగరంలో జరిగిన సోథేబై వేలంలో 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణేన్ని వేలానికి వేయగా.. ఈ నాణేన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం ఈ నాణెం విలువ ఏకంగా రూ.142 కోట్ల రూపాయలు.
ఈ విధంగా ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం మాత్రమే కాకుండా, ఈ వేలం పాటలో ప్రపంచంలోనే అరుదైన ఒక స్టాంపు కూడా8.3 డాలర్లు అనగా 61 కోట్ల రూపాయలకి అమ్ముడుపోవడం ఎంతో విశేషం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం వేలంపాటలో సుమారుగా 15 మిలియన్ డాలర్ల వరకు పోతుందని వేలం నిర్వాహకులు భావించగా వారి అంచనాలకు అందకుండా ఏకంగ ఈ నాణెం 19 మిలియన్ డాలర్లు పోవడంతో వారు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వేలంపాటలో అరుదైన స్థాయిలో అమ్ముడుపోయిన ఈ నాణెం ఒక వైపు అమెరికన్ ఈగిల్, మరొకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముద్రించి ఉంటుంది. ఈ విధమైనటువంటి నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అందుకు గల కారణం అప్పట్లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఈ నాణేలను నిషేధించారు. ప్రస్తుతం ఈ నాణెం అత్యధిక స్థాయిలో ఈ వేలం పాటలు అమ్ముడు పోవడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…