“బాహుబలి” తో తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడు రాజమౌళి, అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజగా విజయేంద్ర ప్రసాద్ “అలీతో సరదాగా” షోలో పలు ఆశక్తికర విషయాలు బయటపెట్టారు. “మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అని హోస్ట్ అలీ అడగడంతో అందరూ షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు.’ అలీ అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్… ఇంకెవరు “పూరీ జగన్నాథ్” అని సమాధానం చెప్పారు. అంతేకాదు పూరీ జగన్నాథ్ అంటే తనకు అసూయ ఆని, ఆయన తన శాత్రువు అని.. “నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను” అని నవ్వుతూ అందరూ ఆశ్చర్యపోయేలా చూపించారు విజయేంద్ర ప్రసాద్. దీనితో ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిన విషయం తెలిసిందే..
అయితే ఇక్కడే కొత్త చిక్కొచ్చి పడింది విజయేంద్ర ప్రసాద్ కి. నా ఫోన్లో ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వాల్ పేపర్ చూడండి అని అయన ఫోన్ చూపిస్తే.. దాంతో పాటు ఆయన ఫోన్లో ఏయే యాప్లు ఉన్నాయా అని భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు నెటిజన్లు. అయితే విజయేంద్ర ప్రసాద్ ఫోన్లో “ప్లే ఇట్” యాప్ కనిపించడంతో… ‘రాజమౌళి గారి ఫాదర్ ఫాదర్ కూడా పైరసీ యూజ్ చేస్తున్నార్రా…’ అంటూ మీమ్స్ క్రియేట్స్ చేసి ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…