Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు.
ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 సినిమా ట్రైలర్ పాట్నాలో జరగడంతో ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి అభిమానులు తరలి వచ్చారు. ఇది చూసిన గేమ్ ఛేంజర్ మేకర్స్ ఏకంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అమెరికాలో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఉంది అయితే ఈ ట్యాగ్ ఉపయోగించుకొని అమెరికాలో ఈ సినిమా వేడుకను నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇలా ఇతర దేశాలలో ఈ సినిమా వేడుకను నిర్వహిస్తే పెద్దగా బజ్ రాకపోవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రేక్షకులలో ఏమాత్రం హైప్ లేదని చెప్పాలి.
సంక్రాంతికి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో కలెక్షన్ల వరకు పరవాలేదు కానీ రికార్డులు సాధించాలి అంటే సినిమాపై మంచి హైప్ ఉండాలి. ఇలాంటి తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించకుండా విదేశాలలో ఈ సినిమా వేడుకలను నిర్వహిస్తే ఖచ్చితంగా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.యూఎస్ఏలో ఓ తెలుగు మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 21న గార్లాండ్లోని కుర్తీస్ కుల్వెల్ సెంటర్లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ నిర్ణయం ఎంతవరకూ కరెక్ట్ అనేది చాలా మంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…