Garikapati Narasimha Rao: గత కొద్దిరోజులుగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగినటువంటి ఓ సంఘటన వల్ల పెద్ద ఎత్తున వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించినటువంటి అలయ్ బలయ్ కార్యక్రమానికి గరికపాటి నరసింహారావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే చిరంజీవి అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తనను చుట్టుముట్టి తనతో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారు.
ఈ క్రమంలోనే గరికపాటి చిరంజీవి వ్యవహారం పై అసహనం వ్యక్తం చేశారు.చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపి ఇక్కడకు రావాలి లేదంటే నాకు సెలవు ఇప్పించండి అంటూ అసహనం వ్యక్తం చేయడంతో ఈ విషయం తీవ్ర దుమారం రేపిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి పాల్గొనగా అక్కడికి కొందరు మహిళలు చిరంజీవితో ఫోటో దిగడానికి వచ్చారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఇక్కడ వారు లేరు కదా అంటూ పరోక్షంగా గరికపాటిని ఉద్దేశించి చెప్పారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది చిరు అభిమానులు గరికపాటికి సరైన పంచ్ పడింది అంటూ కామెంట్ చేశారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గతంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో భాగంగా గరికపాటి మాట్లాడుతూ తనని ప్రవచనాలు చెప్పడానికి ఎవరు ఆహ్వానించారని తెలిపారు.
ఇలా ప్రవచనాలు చెప్పడానికి ఆహ్వానించరు కానీ తన ఇంట్లో పెళ్లి జరుగుతుంది మా మనవరాలు బారసాల జరుగుతుంది. మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించడానికి రండి అంటూ ఆహ్వానిస్తుంటారని తెలిపారు.ఇలా తమ ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులను ఆశీర్వదించడానికి తమకు పెద్ద ఎత్తున డబ్బును కూడా ఇస్తామంటూ ప్రలోభ పెడుతుంటారని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.ఇలా మీ ఇంటికి వచ్చే ఆశీర్వదించడానికి నేనేమైనా సెలబ్రిటీనా మమ్మల్ని సెలబ్రిటీలు చేయొద్దు అంటూ మండిపడ్డారు. అదేవిధంగా ఇలాంటి ఫంక్షన్లకు నన్ను ఆహ్వానించవద్దు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…