Garikapati Narasimha Rao: చిరంజీవి ఫోటో ఇష్యూ పై స్పందించిన గరికపాటి… ఏమన్నారంటే?

Garikapati Narasimha Rao: గత రెండు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడం కోసమేగాబడ్డారు.

ఇలా చిరంజీవి అభిమానులకు ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా గరికపాటి మాత్రం చిరంజీవి ముందు ఫోటో సెషన్ ఆపి ఇక్కడికి రావాలి.. లేదంటే ఈ కార్యక్రమం నుంచి తనకు సెలవు ఇప్పించండి అంటూ చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు గరికపాటి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే గరికపాటి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై నాగబాబు కూడా పరోక్షంగా స్పందించడంతో మెగా అభిమానులు మరింత రెచ్చిపోయి గరికపాటి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా అభిమానుల అధ్యక్షుడు భవాని కుమార్ గరికపాటికి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే భవాని కుమార్ గరికపాటికి ఫోన్ చేసి..అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని చెబుతూ.. మీలాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని భావించలేదంటూ మాట్లాడారు.

Garikapati Narasimha Rao: చిరంజీవి ఎంతో సహృదయుడు

ఈ క్రమంలోనే భవాని శంకర్ మాటలకు గరికపాటి శాంతంగా రియాక్టర్ తో ఈ విషయంపై తాను మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి స్వయంగా మాట్లాడుతానని, ఆయన ఎంతో సహృదయుడు అంటూ గరికపాటి మెగాస్టార్ గురించి ఈ ఫోటో వివాదంపై స్పందించారు. అయితే నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరొక ట్వీట్ చేస్తూ మీ నుంచి క్షమాపణలు మేము కోరుకోవడం లేదు అంటూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.