Imandhi Ramarao : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో ఈ వేడుక నిర్వహించారు. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. ఆయన కనిపించగానే ఒక్కసారి ఫోటో దిగాలని ఎవరికి ఉండదు, అలా ఆయనతో సెల్ఫీ లు తీసుకుంటుండగా అదే సమయంలో ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. చిరంజీవి గారు ఆయన అసహనానికి చిరాకు పడకుండా ఫోటోలు దిగడజం ఆపేసి ఆయనకు శిరసు వంచి నమస్కారం చేశారు. ఇక ఈ ఇష్యూ మీద నాగబాబు గారు గరికపాటి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మొత్తం ఇష్యూ లో అసలు తప్పెవరిది అన్న అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
ఎక్కడ నెగ్గాల్లో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు…
ఇమంది గారు మాట్లాడుతూ చిరంజీవి గారికంటే వయసులో చిన్నవడైనా గరికపాటి నరసింహారావు గారు అలా మైక్ లో అసహనాన్ని వ్యక్తం చేయడం తప్పు. అయితే ఇక్కడ చిరంజీవి గారు చాలా హుందాగా వ్యవహారించారు. డిప్లొమసీ ముందు పుట్టి చిరంజీవి ఆ తరువాత పుట్టారు అన్నట్లుగా ఆయన శైలి ఉంటుంది. ఎవరినీ అంత త్వరగా నొప్పించేలా మాట్లాడరు. ఆ వేడుకలో కూడా ఫోటోషూట్ ఆయన తప్పు కాదు ఆ వేడుకను కో ఆర్డినేట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి.
ఇక ప్రవచనాలు చెబుతున్న గరికపాటి గారు చిరు తో సెల్ఫీలు తీసుకుంటున్న వారి పై అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి గారిని మీరు ఫోటోలు తీసుకోవడం ఆపితే నేను ప్రవచనాలు మొదలు పెడతాను లేదంటే నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పడం చిరంజీవి గారి అభిమానులకు కోపం తెప్పించింది. అయితే అంతా సర్దుకుంది అనే సమయానికి మెగా బ్రదర్ నాగబాబు గారు మా అన్నయ్య గారి ఇమేజ్ ముందు ఈ గరికపాటి ఏ పాటి అంటూ అనడం తో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఈ ఇష్యూ లో గరికపాటి గారికి మద్ధతిస్తూ కొంతమంది మెగాస్టార్ ను ట్రోల్ చేస్తున్నారు. చిరు గారు గరికపాటి గారిని అక్కడ స్టేజి మీదే ఏమి అనకుండా నాగబాబు తో అనిపించారు అనే వాదన మొదలయింది. ఇక వీటిపై ఇమంది గారు మాట్లాడుతూ చిరంజీవి గారు స్వతహాగా వివాదాల జోలికి వెళ్లరు. ఇది పూర్తిగా నాగబాబు గారి మూర్కత్వం, సద్ధుమనిగిన వివాదాన్ని మళ్ళీ లేవనెత్తారు, గరికపాటి గారు అయన రంగంలో ఉద్ధండులే అలాంటి వారిని నువ్వు ఏ పాటి అంటూ కించపరచడం తప్పు అంటూ వాఖ్యణించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…