Prabhas Seenu : ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ఇక సినిమాల్లో వచ్చిన మొదట్లోనే యాక్టింగ్ వైపు కాకుండా ప్రభాస్ కి కేర్ టేకర్ గా ఉండేవారు శీను.
నన్ను ప్రభాస్ భరిస్తున్నాడు…
సినిమాల్లోకి రావాల్ని అనుకున్నపుడే ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ కోర్స్ చేసిన శీను ఆ తరువాత సత్యానంద గారి వద్ద శిక్షణ తీసుకోడానికి ఆయన దగ్గర చేరితే అపుడు హీరో ప్రభాస్ పరిచయమై అలా ఆ పరిచయంతో ప్రభాస్ కి కేర్ టేకర్ గా తనతోనే ఉండేవాడు. ఇక అలా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రభాస్ తో వచ్చిన శీను ప్రభాస్ శీను అయ్యాడు. అయితే సినిమాల్లో అవకాశాలు వస్తే నువ్వు చేసుకో నాతోనే ఉండాల్సిన పని లేదు అని ప్రభాస్ గారు చెప్పారట. ప్రభాస్ గారితో ఉండడం వల్ల శీను కి పరిచయాలు పెరగడం వల్ల అవకాశాలు కూడా వచ్చాయి. ఇక ప్రభాస్ మూడ్ ని బట్టి ఆయనతో ఉంటాను అంటూ చెప్పారు ప్రభాస్ శీను.
అయితే ప్రభాస్ తో ఉండటం వల్ల ఆయన పేరెంట్స్ తోనూ అలానే కృష్ణం రాజు గారు అయన కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది అంటూ చెప్పారు. కృష్ణం రాజు గారు నన్ను మంత్రి అంటుండేవారు అంటూ ప్రాబఙస్ శీను తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక నాలాంటి తింగరోడ్ని భరిస్తున్నాడంటే అది ప్రభాస్ గొప్పతనం, నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన ఓపికగా భరిస్తాడు. నా తప్పులను ఆయన విసుక్కుంటే ఇప్పటికి ఎన్ని సార్లు నన్ను కొట్టేవాడో, మా బంధం ఇన్నేళ్లు సాగదు అంటూ ప్రభాస్ శీను ప్రభాస్ గురించి చెబూతు ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…