Geetha Krishna : సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్స్ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ నిత్యం వైరల్ అవుతున్న సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ మరోసారి మెగాస్టార్ ను, చంద్ర మోహన్ ను కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. కొన్ని పాత్రలకు కొందరు సూట్ కారని, ప్రేక్షకులు ఆ పాత్రల్లో వారిని చూడలేరని మాట్లాడారు. ఇమేజ్ ని దాటి సినిమా చేస్తే జనాలు చూడరని చెప్పారు గీతా కృష్ణ. ఒకడు పైకి వచ్చాడంటే వాడు వేరే దేశాస్థుడైనా మన తెలుగు పేరు తగిలించి మనవాడే అని చెప్పుకుంటూ తిరుగుతాం, అది మన నైజం అంటూ సటైర్లు వేశారు.
చిరంజీవి ఆ సినిమాలో చూడలేక పోయారు…
తమిళ రీమేక్ గా వచ్చిన మంచు పల్లకి సినిమాలో చిరంజీవి, సుహాసిని చావు బతుకుల మధ్య ఉంటే ఏడుస్తాడు ఆ సీన్ జనాలకు నచ్చలేదు. చిరంజీవి ఏడ్చడాన్ని జనాలు ఒప్పుకోలేదు. అప్పటికి చిరు ఇంకా పెద్ద స్టార్ హీరో కాదు అయినా చిరంజీవి అంటే డాన్స్, ఫైట్ అనే భావనలో ఉన్న ప్రేక్షకులకు అలా ఏడవడం నచ్చలేదు సినిమా ఫ్లాప్ అయింది. ఇక అలాగే ‘ఆపద్బాంధవుడు’ సినిమా వంటి సినిమాలు కూడా చిరంజీవి ఇమేజ్ కి దూరంగా ఉండే సినిమాలు అందుకే పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే కమల్ హాసన్ కూడా కథాబలం ఉన్న సినిమాలు చేసాడు.
అందులోనూ గోచి పెట్టుకున్న పాత్రలు చేసాడు అలా చూపించిన డైరెక్టర్ గొప్పోడు, అయినా జనాలు చూసారు. ఆ సినిమాలో కమల్ హాసన్ ను కానీ, చిరంజీవి ని అలా భావించము ఇమేజ్ దాటి చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు అంటూ చెప్పడు. ఇక కమల్ హాసన్ గారి తమిళ సినిమా రీమేక్ తెలుగులో చంద్ర మోహన్ శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో చంద్ర మోహన్ నటనను అనవసరంగా పొగుడుతున్నారని, కమల్ హాసన్ చేసిన దాంట్లో పది శాతం కూడా నటించలేదంటూ ఘాటుగా స్పందించారు. మన తెలుగు వాడు కాబట్టి మనం కమల్ ను దాటి నటించాడు అంటూ గొప్పలు చెప్పుకుంటాం అంతే అంటూ కామెంట్స్ చేసారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…