Ghattamaneni Family: టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ లో ఈనెల 15వ తేదీ తుది శ్వాస విడిచారు. ఇలా ఈయన మరణించడంతో ఒక్కసారిగా ఘట్టమనేని కుటుంబ సభ్యులు, టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యారు.ఇలా ఈయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులను కృష్ణ మరణం ఎంతగానో కృంగదీసింది. మహేష్ బాబు ఒకే ఏడాదిలోనే అన్నయ్యను అలాగే తన తల్లి తండ్రిని కోల్పోవడంతో ఒక్కసారిగా శోకసద్రంలో మునిగిపోయారు.ఇలా కోలుకోకుండా ఒకరి మరణం తర్వాత మరొకరు మరణం మహేష్ బాబును ఎంతగానో కృంగదీసింది. ఇకపోతే కృష్ణ మరణించిన అనంతరం ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని మహేష్ బాబు పూర్తి చేశారు.
ఇకపోతే మహేష్ బాబు పెద్దకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులందరికీ కోసం మహేష్ బాబు ఏకంగా 32 రకాల వంటకాలను తయారు చేయించి అభిమానుల కోసం వడ్డించారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని ఆయన నాకు విలువ కట్టలేని మీ అభిమానాన్ని ఇచ్చారు. ఆయన ఎప్పటికీ మన అందరి గుండెల్లో మన మధ్యనే ఉంటారు. ఇలా మీరందరూ నన్ను ఆదరించి అభిమానిస్తున్నందుకు రుణపడి ఉంటా అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం కృష్ణ పెద్దకర్మ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…