Ghattamaneni Family: టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ లో ఈనెల 15వ తేదీ తుది శ్వాస విడిచారు. ఇలా ఈయన మరణించడంతో ఒక్కసారిగా ఘట్టమనేని కుటుంబ సభ్యులు, టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యారు.ఇలా ఈయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులను కృష్ణ మరణం ఎంతగానో కృంగదీసింది. మహేష్ బాబు ఒకే ఏడాదిలోనే అన్నయ్యను అలాగే తన తల్లి తండ్రిని కోల్పోవడంతో ఒక్కసారిగా శోకసద్రంలో మునిగిపోయారు.ఇలా కోలుకోకుండా ఒకరి మరణం తర్వాత మరొకరు మరణం మహేష్ బాబును ఎంతగానో కృంగదీసింది. ఇకపోతే కృష్ణ మరణించిన అనంతరం ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని మహేష్ బాబు పూర్తి చేశారు.
ఇకపోతే మహేష్ బాబు పెద్దకర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానులందరికీ కోసం మహేష్ బాబు ఏకంగా 32 రకాల వంటకాలను తయారు చేయించి అభిమానుల కోసం వడ్డించారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తన తండ్రిని తలుచుకొని ఆయన నాకు విలువ కట్టలేని మీ అభిమానాన్ని ఇచ్చారు. ఆయన ఎప్పటికీ మన అందరి గుండెల్లో మన మధ్యనే ఉంటారు. ఇలా మీరందరూ నన్ను ఆదరించి అభిమానిస్తున్నందుకు రుణపడి ఉంటా అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం కృష్ణ పెద్దకర్మ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…