Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణ గారి మరణం మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఎంతగానో కలిసి వేసింది. ముఖ్యంగా మహేష్ బాబు తన తండ్రి మరణంతో ఒకసారిగా కృంగిపోయారు. ఓకే ఏడాదిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని లోటు అని చెప్పాలి.
ఈ విధంగా ఓకే ఏడాదిలోనే అన్నయ్య, తల్లి తండ్రిని కోల్పోవడంతో మహేష్ బాబు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. 12 రోజులు పూర్తయిన ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే హైదరాబాదులో ఓ ఫంక్షన్ హాల్లో కృష్ణ గారి పెద్దకర్మ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వేలాదిమంది అభిమానులతో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై కృష్ణ గారికి నివాళులు అర్పించి మరోసారి ఆయనని గుర్తు చేసుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు వేదికపై తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ… నాన్న నా జీవితంలో నాకు ఎన్నో ఇచ్చారు.. కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టారు. ఇలా ఎన్నో ఇచ్చినప్పటికీ నాకు మీ అభిమానం ఎంతో గొప్పది. నాన్న నేడు మన మధ్యన లేకపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి.ఆయన ఎప్పటికీ నా గుండెల్లోను మీ గుండెల్లోనూ ఉంటారు అంటూ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…