Balakrishna: నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈయన ఫలానా దర్శకుడు డైరెక్షన్లో ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభిమానులు ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఇకపోతే తాజాగా మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వార్తలు రావడంతో అభిమానులు ఈ విషయంపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అక్కడ చిత్ర బృందం సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వచ్చే ఏడాది తప్పకుండా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో నందమూరి అభిమానుల ఆనందానికి ఆ వదులు లేకుండా పోయాయి.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు. అయితే బోయపాటి దర్శకత్వంలో సినీ ఎంట్రీ ఉండబోతుందా అంటూ ప్రశ్నించగా ఆ ప్రశ్నకు బోయపాటి అంతా దైవ నిర్ణయం అంటూ సమాధానం చెప్పడంతో బాలయ్య తనలో తాను నవ్వుకున్నారు.
మరి వచ్చే ఎడాది మోక్షజ్ఞ బోయపాటి దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారా లేక మరో దర్శకుడు ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అఖండ సీక్వెల్ కూడా ఉండబోతుందంటూ చిత్ర బృందం చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని తెలియడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…