ట్యాక్సీ డ్రైవర్ గా అతడు పనిచేస్తున్నాడు. వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతి అతడి ట్యాక్సీలోనే ఇంటికి.. మరియు ఆసుపత్రికి వెళ్తూ ఉండేది. దీంతో పెళ్లైన అతడితో ప్రేమలో పడింది. కానీ అతడు.. ఆమె ప్రేమకు నిరాకరిస్తూ వచ్చాడు. వినకపోవడంతో ఇతరులతో ఆమె ఫోన్ చేయిస్తూ బెదిరించింది. చివరకు అతడు అత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్.. గోదావరి అనే యువతితో వివాహం జరిగింది. వాళ్లకు ఒక కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. అతడు జీవనోపాధి కోసం ట్యాక్సీ నడుపుతుండగా.. తన భార్య ఇంటి దగ్గరే హౌస్ వైఫ్ గా ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే మండలానికి చెందిన తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది.
తన ఇంటికి.. ఆసుపత్రికి గణేశ్ ట్యాక్సీలోనే వెళ్తుండేది. అయితే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు అది కాస్త ప్రేమగా మారింది. కానీ ఆ ప్రేమకు గణేశ్ మాత్రం ససేమిరా అన్నాడు. తనకు వివాహం అయిందని ఎంత చెప్పినా ఆ యువతి వినిపించుకోలేదు.
ఆ రోజు నుంచి అతడు ఆమెను దూరంగా పెడుతున్నా.. ఇతరులతో ఫోన్ చేయించి బెదిరించసాగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గణేశ్.. పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…