Cm Jagan: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే మద్యం అమ్మకాలకు సంబంధించి మొదటి నుంచి కూడా నిబంధనలు జారీ చేస్తు వస్తున్న ప్రభుత్వం.. తాజాగా మద్యం విక్రయ వేళలను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహించుకొవచ్చని తెలిపింది.
అంతే కాకుండా విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేసే వారు. ఈ సమయాన్ని గంట పొడిగించింది ప్రభుత్వం. మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ మధ్యకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల కిందట మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసిన ప్రభుత్వం.. వ్యాట్ తో పాటు.. స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని క్రమబద్ధీకరించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ వేళలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సంక్రాంతికి ముందే ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉన్నా.. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోంటారనే ఉద్దేశ్యంతో వాయిదా వేసినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దానిలో భాగంగానే.. రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను జనవరి 18 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ నైట్ కర్ఫ్యూ జనవరి 31 వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…