General News

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

AP Breaking News: కాపు సామాజిక వర్గానికి జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి కేసులను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సామాజిక వర్గానికి ఊరట కలగనుంది. ఈ మేరకు జీవో ను కూడా విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ ఈ జీవోను విడుదల చేశారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

జీవోలో కేసుకు సంబంధించిన వివరాలు… అందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటించారు.
2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా… తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది.  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుని లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తగలబెట్టారు. దీంతో ఈ ఘర్షణలకు కారణమైన వారి పైన వివిధ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.

రైలును తగలబెట్టడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం వంటి ఘర్షణలపై కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్, ఐపీసీ సెక్షన్ ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీ లోని 109, 143, 147, 148, 149, 427, 435 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ..

2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమంపై నమోదైన కేసులను ఉపసంహరించడం మొదలుపెట్టింది. 2019 మార్చి వరకు తొలి దశలో తొలి బహిరంగ సభ రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసులను ఉపసంహరించుకున్నారు. 2020లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదయిన కేసులు అన్నింటిని ఎత్తివేస్తూ హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తుని ఘటనకు సంబంధించిన కేసులు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సంబంధిత కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు బిశ్వజిత్ తెలిపారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు, నగరం, మచిలిపురం, బిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిని ప్రస్తుతం ఎత్తివేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

15 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago