General News

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

AP Breaking News: కాపు సామాజిక వర్గానికి జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి కేసులను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సామాజిక వర్గానికి ఊరట కలగనుంది. ఈ మేరకు జీవో ను కూడా విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ ఈ జీవోను విడుదల చేశారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

జీవోలో కేసుకు సంబంధించిన వివరాలు… అందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటించారు.
2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా… తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది.  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుని లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తగలబెట్టారు. దీంతో ఈ ఘర్షణలకు కారణమైన వారి పైన వివిధ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.

రైలును తగలబెట్టడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం వంటి ఘర్షణలపై కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్, ఐపీసీ సెక్షన్ ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీ లోని 109, 143, 147, 148, 149, 427, 435 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ..

2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమంపై నమోదైన కేసులను ఉపసంహరించడం మొదలుపెట్టింది. 2019 మార్చి వరకు తొలి దశలో తొలి బహిరంగ సభ రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసులను ఉపసంహరించుకున్నారు. 2020లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదయిన కేసులు అన్నింటిని ఎత్తివేస్తూ హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తుని ఘటనకు సంబంధించిన కేసులు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సంబంధిత కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు బిశ్వజిత్ తెలిపారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు, నగరం, మచిలిపురం, బిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిని ప్రస్తుతం ఎత్తివేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

24 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago