Connect with us

General News

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

AP Breaking News: కాపు సామాజిక వర్గానికి జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి కేసులను ఎత్తి వేస్తున్నట్లు

Published

on

AP Breaking News: కాపు సామాజిక వర్గానికి జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి కేసులను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సామాజిక వర్గానికి ఊరట కలగనుంది. ఈ మేరకు జీవో ను కూడా విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ ఈ జీవోను విడుదల చేశారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!
AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

జీవోలో కేసుకు సంబంధించిన వివరాలు… అందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటించారు.
2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా… తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!
AP Breaking News: కాపులకు గుడ్ న్యూస్..! వాటిని కొట్టివేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం..!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది.  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తుని లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తగలబెట్టారు. దీంతో ఈ ఘర్షణలకు కారణమైన వారి పైన వివిధ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.

రైలును తగలబెట్టడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం వంటి ఘర్షణలపై కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్, ఐపీసీ సెక్షన్ ల కింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీ లోని 109, 143, 147, 148, 149, 427, 435 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Advertisement


హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ..

2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమంపై నమోదైన కేసులను ఉపసంహరించడం మొదలుపెట్టింది. 2019 మార్చి వరకు తొలి దశలో తొలి బహిరంగ సభ రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసులను ఉపసంహరించుకున్నారు. 2020లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదయిన కేసులు అన్నింటిని ఎత్తివేస్తూ హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తుని ఘటనకు సంబంధించిన కేసులు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సంబంధిత కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు బిశ్వజిత్ తెలిపారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు, నగరం, మచిలిపురం, బిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిని ప్రస్తుతం ఎత్తివేశారు.

Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!