మన దేశంలో ఆరు కోట్లకు పైగా యూజర్లు డిజిటల్ లావాదేవీల కోసం గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారనే సంగతి విదితమే. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ గూగుల్ పే యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. దేశంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత నగదు రహిత లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రధానీ మోదీ నగదు రహిత లావాదేవీలకు పిలుపునివ్వడంతో ప్రజలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి వచ్చే ఏడాది నుండి గూగుల్ పే యాప్ ను వినియోగించే కస్టమర్లు డిజిటల్ లావాదేవీల కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. గూగుల్ పే ఛార్జీల గురించి అధికారికంగా ప్రకటన చేయకపోయినా అనధికారికంగా వైరల్ అయిన వార్తలు యూజర్లను తెగ టెన్షన్ పెట్టాయి. అయితే గూగుల్ పే కస్టమర్లు టెన్షన్ పడుతున్న నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించి స్పష్టతనిచ్చింది.
డిజిటల్ లావాదేవీలకు ఛార్జీలను అమలు చేస్తుండటం వాస్తవమేనని అయితే కేవలం అమెరికాలోని కస్టమర్లకు మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపింది. భారత్ లోని గూగుల్ పే కస్టమర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కంగారు పడవద్దని గూగుల్ పే సంస్థ వెల్లడించింది. గూగుల్ పే తాజా నిర్ణయం వల్ల భారత్ లోని వినియోగదారులకు టెన్షన్ తగ్గినట్టేనని చెప్పవచ్చు.
భారత్ లో గూగుల్ పే యాప్ కు 110 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. సంస్థ భారత్ లో 6.7 కోట్ల మంది గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారని, 30 లక్షల మంది వ్యాపారులు గూగుల్ పే బిజినెస్ యాప్ ను ఉపయోగిస్తున్నారని సంస్థ తెలిపింది.
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…