Holidays: విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించడం కర్ణాటక ప్రభుత్వం..! కారణం అదేనా?
Holidays: కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఇప్పటికే ఉడిపి జిల్లాతో పాటు శివమొగ్గ, బెళగావి, కొప్పెల జిల్లాలకు పాకింది. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరవ్వడాన్ని మరో వర్గం విద్యార్థులు వ్యతిరేఖిస్తూ.. కాషాయ కండువాలతో హాజరు అవుతున్నారు.
అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్కూళ్లు, కళాశాలలకు కేవలం యూనిఫాంతోనే హాజరుకావాలని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది.
రెండు వర్గాలు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈవ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హిజాబ్ ధరించి విద్యార్థులు తరగతులకు హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుండగా… బీజేపీ మాత్రం విద్యాలయాల్లో చదువుకునే వారంతా సమానభావంతో ఉండేదుకు యూనిఫాంతో హాజరుకావాలని కోరుతోంది.
ప్రస్తుతం ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు మంజూరు చేశారు. మరోవైపు ప్రస్తుతం హిజాబ్ అంశం కర్ణాటక హైకోర్ట్ ముందుంది. రేపు కూడా హైకోర్ట్ లో విచారణ జరుగనుంది. ఈ వివాదంపై రాజ్యాంగమే మాకు భవద్గీత అని.. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం అని వ్యాఖ్యానించింది. విద్యార్థులంతా సంయమనం పాటించాలని కోరింది. శాంతియుతంగా ఉండాలని సూచించింది.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…