Holidays: విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించడం కర్ణాటక ప్రభుత్వం..! కారణం అదేనా?
Holidays: కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఇప్పటికే ఉడిపి జిల్లాతో పాటు శివమొగ్గ, బెళగావి, కొప్పెల జిల్లాలకు పాకింది. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరవ్వడాన్ని మరో వర్గం విద్యార్థులు వ్యతిరేఖిస్తూ.. కాషాయ కండువాలతో హాజరు అవుతున్నారు.
అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్కూళ్లు, కళాశాలలకు కేవలం యూనిఫాంతోనే హాజరుకావాలని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది.
రెండు వర్గాలు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈవ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హిజాబ్ ధరించి విద్యార్థులు తరగతులకు హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుండగా… బీజేపీ మాత్రం విద్యాలయాల్లో చదువుకునే వారంతా సమానభావంతో ఉండేదుకు యూనిఫాంతో హాజరుకావాలని కోరుతోంది.
ప్రస్తుతం ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు మంజూరు చేశారు. మరోవైపు ప్రస్తుతం హిజాబ్ అంశం కర్ణాటక హైకోర్ట్ ముందుంది. రేపు కూడా హైకోర్ట్ లో విచారణ జరుగనుంది. ఈ వివాదంపై రాజ్యాంగమే మాకు భవద్గీత అని.. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం అని వ్యాఖ్యానించింది. విద్యార్థులంతా సంయమనం పాటించాలని కోరింది. శాంతియుతంగా ఉండాలని సూచించింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…