బిగ్ బాస్ వేదికపై గ్రీన్ ఇండియా ఛాలెంజర్.. ఎంపీ సంతోష్ కుమార్ ఈ రోజు సందడి చేయనున్నారు. శనివారమే ఇతడు షోలో పాల్గొనగా.. ఆదివారం ఎపిసోడ్ లో అతడు కనిపించనున్నాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే.. పర్యావరణంపై అవగాహన కల్పించడం. అందరిచేత మొక్కలు నాటిస్తున్నారు తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.
ఈ ఛాలెంజ్ లో అతడు సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఇలా మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షోలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అతడు ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నారు. నిజానికి శనివారంమే దీనికి సంబంధించి షూటింగ్ పూర్తవగా.. ఆదివారం దీనిని ప్రసారం చేయనున్నారు. ఇక ఈ షో చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో సీజన్ ముగియనుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం హౌస్లో 6 మంది పోటీదారులు ఉన్నారు. వారిలో ఒకరు నేడు ఎలిమినేట్ కానున్నారు. దాంతో ఇంట్లో 5 మంది సభ్యులు ఉంటారు. ఇప్పటికే దీనిలో శ్రీరామచంద్ర, సన్నీ టాప్ 5 లో ఉన్నారు. మిగతా మానస్, సిరి, షణ్ముక్ ఈ రోజు ఎపిసోడ్ లో టాప్ 5 లో టికెట్ దక్కించుకోనున్నారు. ఇక ఒక్క వారం మాత్రమే ఉండగా.. ఎవరు టైటిల్ గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ షోలో సంతోష్ కుమార్ సందడి ఎలా ఉంటుందో చూడాలి.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…