Group-1 Mains exams cancelled.. High Court's key verdict!
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరీక్షలను రద్దు చేస్తూ, తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్ సీ)ని ఆదేశించింది. అలాగే, గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను కూడా రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపి, అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది. మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాలని లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీకి సూచించింది.
ఈ తీర్పుతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల భవిష్యత్తు మరోసారి అనిశ్చితిలో పడింది. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు నియామక ప్రక్రియ కొనసాగించాలని కోర్టును కోరారు. అయినప్పటికీ, కేసు పెండింగ్ లో ఉన్నందున నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో, అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై టీఎస్పీఎస్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…