Guntturu kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించుకుంది అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ పనులు మాత్రం ముందుకు సాగలేదు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.
ఇక ఈ సినిమా తాజాగా మరో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించుకుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా లోమహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు దీంతో పూజ స్థానంలో నటించే మరో హీరోయిన్ ఎవరు అంటూ పెద్ద ఎత్తున హీరోయిన్ గురించి వార్తలు హల్చల్ చేశాయి.
ఇకపోతే పూజ హెగ్డే స్థానంలో నటి మీనాక్షి చౌదరి నటించబోతున్నారంటూ స్వయంగా ఆమె ప్రకటించారు. దీంతో పూజ స్థానంలో మీనాక్షి చౌదరి సెట్ లోకి అడుగు పెట్టారని ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న తెలుస్తుంది. మీనాక్షి చౌదరి నటించిన హత్య సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ తాను గుంటూరు కారం సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారితో కలిసి నటించిన మొదటి రోజు అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఇలా ఈమె గుంటూరు కారం సినిమాలో నటించబోతున్నాననే విషయాన్ని తెలియజేయడంతో పూజ స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికయ్యారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…