గురుగ్రామ్లో ఒక సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రియుడిపైనే అత్యాచారం కేసు పెట్టింది. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టారు.
సోని దేవి పదహారేళ్ల వయసులోనే విక్రమ్ను ప్రేమించి వివాహం చేసుకుంది. వారిద్దరూ దాదాపు 18 ఏళ్లు సంతోషంగా జీవనం సాగించారు. అయితే, కాలక్రమేణా సోని దేవి మనసు పక్కనే ఉండే రవీంద్ర అనే వ్యక్తిపైకి మళ్లింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది.
ఈ వ్యవహారాన్ని సోని దేవి కుమార్తె గమనించింది. తల్లి ఫోన్లో ఇంటిమేట్ వీడియోలు చూసినట్లు తండ్రి విక్రమ్కు చెప్పింది. విక్రమ్ తన భార్య ఫోన్ను తనిఖీ చేయగా, అది నిజమేనని తేలింది. దీంతో విక్రమ్ తన భార్యపై తీవ్రంగా ఆగ్రహించి తిట్టాడు.
భర్త కోపం చూసి భయపడ్డ సోని దేవి, ప్రియుడు రవీంద్రతో కలిసి విక్రమ్ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. భర్త ఆఫీసు నుంచి బయటకు రాగానే, రవీంద్ర తన సహచరులతో కలిసి విక్రమ్ను కిడ్నాప్ చేశాడు. అదే రాత్రి విక్రమ్ను హత్య చేసి, ఒక గేటెడ్ కమ్యూనిటీ వెనకాల అతని మృతదేహాన్ని పాతిపెట్టారు.
హత్య తర్వాత, సోని దేవి తెలివిగా తన భర్త మిస్సింగ్ కేసు పెట్టింది. అంతేకాకుండా, సెక్స్ వీడియోలు బయటపడే అవకాశం ఉందని భావించి, ప్రియుడు రవీంద్రపైనే అత్యాచారం కేసు కూడా పెట్టింది.
సోని దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేసి విచారించగా, అసలు నిజం బయటపడింది. భర్త విక్రమ్ను హత్య చేసింది సోని దేవి మరియు రవీంద్ర అని తేలింది. దీంతో పోలీసులు సోని దేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురుగ్రామ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…