Guvvala Balaraju's resignation.. Sensational comments on KCR family!
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి ఎదురవుతున్న వరుస ఎదురుదెబ్బల్లో భాగంగా, నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు, విచారణలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న బీఆర్ఎస్కు ఈ రాజీనామా మరింత ఇబ్బందికరంగా మారింది. సోమవారం ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పంపగా, మంగళవారం మీడియా సమావేశంలో తన నిర్ణయంపై స్పష్టత ఇచ్చారు.
బాలరాజు తన రాజీనామాను పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే తీసుకున్నానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “నేను ఈ నెల 2న రాజీనామా సమర్పించాను. కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేశానని చెప్పడం సరైంది కాదు. నా లేఖలో ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే కష్టాల్లో ఉంది, నేను వారికి మరింత బాధ కలిగించదల్చుకోలేదు” అని బాలరాజు వివరించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
రాజకీయాల్లోకి రాకముందే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను కేవలం పాత్రధారినేనని, సూత్రధారి కాదని గువ్వల బాలరాజు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘటనకు తాను కేసీఆర్ ఆదేశాల మేరకే వెళ్లానని వెల్లడించారు. అలాగే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని తాను ఎప్పుడూ మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.
“కాంగ్రెస్లోకి రావాలని పెద్ద నాయకులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా నియోజకవర్గానికి చెందినవారే. అయితే, ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. నా అనుచరులు, జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తాను” అని బాలరాజు వెల్లడించారు. బాలరాజు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…