Movie News

Gunturu Kaaram: గుంటూరు కారం సినిమా పరిస్థితి చాలా దారుణం.. ఆ సినిమాకు క్యూ కడుతున్న అభిమానులు?

Gunturu Kaaram: తాజాగా గుంటూరు కారం జై హనుమాన్ సినిమాలు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. మొదటినుంచి ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు రెండు సినిమాలు కూడా ఈక్వల్ గానే ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయబడుతూ వచ్చాయి. కానీ ఎక్కువ శాతం ప్రేక్షకులు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ఆసక్తిని చూపించారు. కానీ బుక్ మై షో అలాంటి టికెట్ బుకింగ్ యాప్ లలో మాత్రం హనుమాన్ సినిమాకే ఎక్కువ శాతం మెజారిటీ వచ్చింది. అయితే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు గుంటూరు కారం సినిమా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బ్యాడ్ టాక్ ని తెచ్చుకోవడం తోపాటు కలెక్షన్ల విషయంలో కూడా వెనుక పడుతోంది. మరోవైపు హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. గుంటూరు కారం పరిస్థితి దారుణంగా మారింది. సంక్రాంతికి వచ్చింది కాబట్టే ఈ మాత్రం వసూళ్లైనా వచ్చాయి. లేదంటే డిజాస్టర్‌గా నిలిచి రెండో రోజే జెండా ఎత్తే పరిస్థితి వచ్చేది. గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు, బ్యాడ్ మౌత్ టాక్ వచ్చింది. జనాలు గుంటూరు కారం వైపు చూడటం లేదు. ఈ విషయాన్ని బుక్ మై షో చూస్తే అర్థం అవుతుంది.

గుంటూరు కారంకు డిమాండ్ లేకపోయినా కూడా థియేటర్లు ఉన్నాయి. నైజాంలో గుంటూరు కారంకే థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు సినిమాను జనాలు చూడాలనుకోవడం లేదు. అయినా కూడా అదే సినిమాను థియేటర్లలో ఆడిస్తున్నారు. అదే ఆంధ్రలో అయితే డిమాండ్ ఉన్న సినిమాను వేసుకుంటున్నారు. హనుమాన్ సినిమాకు అక్కడ ఇరవై శాతం స్క్రీన్‌లు పెరిగాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు ఎక్కువ థియేటర్స్ లో గుంటూరు కారం సినిమా విడుదల అవ్వగా ప్రస్తుతం ఎక్కువ థియేటర్స్ లో హనుమాన్ సినిమానే ప్రదర్శితం అవుతుంది.

హనుమాన్ సినిమాను ముందు నుంచి కూడా నైజాం ఏరియాలో అడుగు పెట్టనివ్వలేదు. దిల్ రాజు ఉన్న థియేటర్లన్నీ కూడా గుంటూరు కారంకే ఇచ్చాడు. ఇక శిరీష్ రెడ్డి అయితే హనుమాన్ గురించి దారుణంగా మాట్లాడాడు. గుంటూరు కారంతో పోలిక ఏంటి కావాలంటే నా సామిరంగాతో పోల్చుకోమను అంటూ కాస్త దురుసుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో చాలా మంది హనుమాన్‌ను తక్కువ అంచనా వేశాడు. ఇదేం ఆడుద్దిలే అని లైట్ తీసుకున్నారు. చివరకు రిజల్ట్ చూస్తే టాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది హనుమాన్.

గుంటూరు కారంని వెనక్కి నెట్టేసిన హనుమాన్..

ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మకు సలాం కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత క్వాలిటీ ఎలా వచ్చిందంటూ బాలీవుడ్ సైతం షాక్ అవుతోంది. ఒక వేళ డిమాండ్‌కు తగ్గట్టుగా హనుమాన్‌కు థియేటర్లు ఇచ్చి ఉంటే కలెక్షన్లు వేరేలా ఉండేవి. కేవలం ప్రీమియర్లతోనే నైైజాంలో రెండున్నర కోట్లకు పైగా వసూళ్ చేసింది హనుమాన్. అదే పూర్తి స్థాయిలో థియేటర్లు ఇచ్చి ఉంటే దుమ్ములేపేసేది. ఇప్పుడు హైద్రాబాద్‌లోనే గుంటూరు కారంకు 712 షోలు ఉంటే అందులో కనీసం 250 కూడా ఫుల్ అవ్వలేదు. అదే హనుమాన్‌ను చూసుకుంటే 230కి 228 ఫుల్ అయ్యాయి. అంటే ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందే అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్‌లోనూ హనుమాన్ పై చేయి సాధించింది. యూఎస్‌లో 369 లొకేషన్ల నుంచి 408k డాలర్లను వసూళ్ చేస్తే.. 409 లొకేషన్ల నుంచి గుంటూరు కారం 334k డాలర్లను మాత్రమే వసూళ్ చేసింది. అంటే హనుమాన్‌ను ఇకపై గుంటూరు కారం అందుకోవడం కష్టమే అన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే గుంటూరు కారంను కుర్చీ మడత పెట్టి.. పక్కన పడేసింది హనుమాన్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

24 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

24 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago