రోజురోజుకు సైబర్ నేరగాళ్ల తాకిడి ఎక్కవ అయిపోతుంది. ఎక్కడ చూసినా దొంగతనాలు, హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కూడా అప్ డేట్ అవుతూనే ఉన్నారు. కొత్త కొత్త టెక్నాలజీతో నేరలను కూడా కొత్త కొత్తగా చేస్తున్నారు. దీంతో వాళ్లను పట్టుకోవడం పోలీసులకు ఓ సవాల్ గా మారిపోయింది. తాజాగా ఓ ఘటనలో పోలీసులతోనే దమ్ముంటే నన్ను పట్టకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ సైబర్ మోసగాడి చేతిలో తాను మోసపోయానని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అప్పుడే అతడిని మోసం చేసిన సైబర్ మోసగాడు ఫోన్ చేశాడు. ‘మీ డబ్బు వాపసు వస్తుంది.. కొన్ని చార్జిల కింద డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని’..అతడికి చెబుతాడు. అప్పడు బాధితుడు తాను పోలీస్ స్టేషన్ లో ఉన్నానని.. పోలీస్ అధికారితో మీరు మాట్లాడంటూ ఫోన్ ఇస్తాడు. అతడు ఆ ఫోన్ కట్ చేయకుండా ఎలాంటి భయం లేకుండా అతడితో మాట్లాడాడు. మా ఆదాయం రోజుకు రూ.20 వేలు ఉంటుంది.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అంటూ ఆ అధికారికి సవాల్ విసిరాడు ఆ సైబర్ నేరగాడు.
ఆ అధికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంత ధైర్యంగా అతడు మాట్లాడం చూసి.. అతడి నోటి వెంట మాట కూడా మాట్లాడలేదు. అతడేం మాట్లాడంటే..‘తాను ఈ ఫోన్ మాట్లాడిన తర్వాత సిమ్ మార్చేస్తా.. మరో సిమ్ తీసుకుంటా.. సిమ్ లు సరఫరా చేసే ముఠా ఉంది.. అమాయకులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలను తాము ఉపయోగించుకుంటున్నామంటూ’ చెప్పాడు.
మా ఊరిలో నేనొక్కడినే కాదు ఏడో తరగతి చదివే ప్రతీ ఒక్కడూ ఇలానే చేస్తారు అంటూ చెప్పాడు. ఆ సంభాషణ అయిన తర్వాత తాము ఉత్తరాది రాష్ట్రాల్లో అంటే జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి వారు ఈ మోసాలకు పాల్పడుతున్నారని.. ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్ప వద్దని.. ఏమైనా సమస్యలు ఉంటే.. 100 లేదా 155260కు ఫోన్ చేయాలని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…