చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి రాకపోవడంతో వైరస్ ను అదుపు చేయడం కష్టమవుతోంది. దేశంలో ప్రతిరోజూ 70,000కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ కు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
అయితే తాజాగా ముంబై పోలీసులు వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఎవరికైనా కరోనా వైరస్ నిర్ధారణ అయితే బొమ్మా బొరుసు ఆడాలని బొమ్మ పడితే కరోనా వైరస్ ను తప్పక జయిస్తారని పేర్కొన్నారు. పోలీసులు ఇలాంటి ట్వీట్ పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా…? అందులోనే అసలు లాజిక్ ఉంది. పోలీసులు పెట్టిన ట్వీట్ లోనే హెడ్స్, టెయిల్స్ కు సంబంధించిన ఇమేజ్ ను పెట్టారు.
ఆ ఇమేజ్ లో ఒకదానిపై నలుపు తెలుగు రంగులలో కనిపించే ఇల్లు, ఇంటిలో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి బొమ్మ పెట్టారు. దీనిని హెడ్స్ గా పేర్కొన్నారు. హెడ్స్ పెడితే కరోనా సోకితే ఇంట్లో ఉండాలని కరోనా లేకుండా ఉంటే బయటకు వస్తే మాస్క్ ధరించాలని అర్థం. అలా కాకుండా టెయిల్స్ పడితే కరోనా వైరస్ ఓడిపోతుందని అర్థం వచ్చేలా ఇమేజ్ ను డిజైన్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
మహారాష్ట్ర రాష్ట్ర పోలీసులు భలే చెప్పారే..? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మహారాష్ట్ర పోలీసుల తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూటిగా స్పష్టంగా చెప్పారని పేర్కొంటున్నారు. మరోవైపు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…