సాధారణంగా ప్రతి రోజూ మనం ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనీదే ఇతర కార్యకలాపాలను కొనసాగించరు. ఈ క్రమంలోనే కొందరు రోజు పరిమితం లేకుండా కప్పుల కొద్ది కాఫీలు తాగుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతి రోజు అధిక మొత్తంలో కాఫీ తాగటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని కొందరు భావిస్తారు. అదే విధంగా అధిక మొత్తంలో కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయని మరి కొందరు భావిస్తారు. అయితే రోజులో మూడు కప్పుల కాఫీ తాగే వారికి అమెరాకాలోనో ఓ ప్రసిద్ధ హెల్త్ యూనివర్సిటీ ఓ శుభవార్తను తెలిపింది.
ప్రతి రోజుకు ఒక మనిషి కేవలం నాలుగు వందల మిల్లిగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యవంతంగా, ఎలాంటి గుండెజబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండగలరని నిపుణులు తెలియజేస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో మనం రోజంతా ఎంతో హుషారుగా ఉండగలుగుతాము.అయితే కెఫిన్ ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఒక రకంగా చెప్పాలంటే కాఫీ ఒక మత్తుపదార్థాల కిందకి వస్తుంది.
ప్రతిరోజు 400 ml కెఫిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు రావడం చాలా అరుదు అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కెఫినేటెడ్ కాఫీ తాగడం ఎంతో ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా ప్రతి రోజు పరిమితికి మించకుండా కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
సాధారణ వ్యక్తులు ప్రతిరోజూ 400 ml కెఫిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు కానీ, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు మాత్రం ప్రతిరోజు కేవలం 200ml మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అది కూడా డాక్టర్లను సంప్రదించిన తరువాత మాత్రమే కాఫీ తాగాలని సూచించారు.
తెలుగు సినిమా చరిత్రలో కొత్త దారిని చూపించిన చిత్రాల్లో ‘శివ’ ఒకటి. ఈ సినిమా వెనుక జరిగిన సంఘటనలు ఇప్పటికీ…
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళలు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, ఆహారపు అలవాట్ల మార్పులు…
వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా తన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభమైన AI ఆధారిత…
పిజ్జా అంటే చాలామందికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. రుచికరమైన చీజ్, సాస్, టాపింగ్స్తో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిపుణులు…
ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేను నిర్వహిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి మలేరియా…
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై వచ్చిన కల్తీ ఆరోపణలపై నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును పూర్తి…