Health News

కడుపు ఉబ్బరంగా ఉందా.. ఈ ఆహార పదర్ధాలను తీసుకోండి..!

కొంతమందికి ఏమీ తినకపోయినా.. కొద్దిగా తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. దీనినే బ్లోటింగ్ అని కూడా అంటారు. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే.. మలబద్దకం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం. చక్కెర, పిండి పదార్ధాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి వంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే..కొన్ని ఆహార పదర్థాలు తీసుకోవాలి. అవేంటంటే.. పీచు పదర్థాలను జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే తీసుకోవాలి. బెర్రీలు, పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో ఎక్కువగా పీచు పదర్థాలు ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్‌లు లభిస్తాయి.

డైజెస్టివ్ ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఫైనాపిల్ ప్రోటీన్లు, పిండి పదార్ధాలు తేలిగ్గా అరిగేలా చేస్తాయి. కివి, బొప్పాయి కూడా అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో సోడియం ఎక్కువగా ఉన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అయితే అరటి పండు తినడం వల్ల శరీరం నుంచి సోడియంను బయటికి పంపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

యాపిల్ సిడార్ వెనిగర్, పసుపు, అల్లం, నిమ్మ, ప్రోబయోటిక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. వీటిని తీసుకోవడమే కాకుండా తరచూ రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలి. ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా ఆహారాన్ని నమిలి తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ మంచిగా పని చేస్తుంది.అప్పుడే కడుపు ఉబ్బరం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గంగోత్రి నుంచి బద్రీనాథ్ వరకు.. చార్ ధామ్ యాత్ర షెడ్యూల్ ఇదే!

అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…

14 minutes ago

రూ.600 వరకు ధర.. ఈ అడవి పండ్లకు ఎందుకింత డిమాండ్?

ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో ‘పాల పండ్లు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరిగే…

22 minutes ago

చికెన్ స్కిన్ తింటే శరీరంలో ఇన్ని మార్పులా..? తినే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!

చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత…

32 minutes ago

కోహ్లీ లైక్ వివాదం మళ్లీ రచ్చ.. మోడల్ స్పందనతో కొత్త మలుపు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…

4 hours ago

ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. రెజీనా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…

4 hours ago

రూ. 60 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు.. జట్లను ముంచేస్తున్న ముగ్గురు ఆటగాళ్లు

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…

4 hours ago