health tips for women to reduce bloating problem in periods time
Health Tips : ప్రతి మహిళ నెలలో మూడు రోజులు నుంచి ఐదు రోజుల పాటు పీరియడ్స్ కారణంగా బాధపడుతూ ఉంటారు. చాలా మంది స్త్రీలు పీరియడ్స్ అంటే ఎంత గానో ఇబ్బందికి గురవుతారు. సరైన ఆహారాన్ని తీసుకోలేరు. కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలానే మూడ్ స్వింగ్స్ లాంటివి కూడా వారిని బాధిస్తూ ఉంటాయి.
చాలా మంది స్త్రీలు మెనుస్ట్రేషన్ కంటే ముందే బ్లోటింగ్తో ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్య కొందరిలో మెనుస్ట్రేషన్ సైకిల్కు వారం ముందు గానే ప్రారంభమవుతుంది. కొన్ని సార్లు అసౌకర్యంగా ఉండడం మరియు నొప్పి కూడా ఉంటుంది. చాలా మంది స్త్రీలు మెనుస్ట్రేషన్ సైకిల్ కంటే ముందే బ్లోటింగ్తో బాధ పడుతూ ఉంటారు.
ఈ సమస్యలను మంచి ఆహారం పద్ధతి ద్వారా దూరం చేసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ కొన్ని చిట్కాలను తెలియజేశారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం… వ్యాయామాలు రోజు చేయడం ద్వారా మెన్సెస్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టవచ్చట. అలానే మనం తీసుకునే ఆహారంతో నొప్పులను దూరం చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది, దాంతో బ్లోటింగ్ సమస్య మాయమవుతుంది.
సహజంగా యూరినేషన్ ప్రక్రియకు ఉపయోగపడే ఆహార పదార్థాలను తీసుకోండి. దాంతో యూరిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇలా చేస్తే వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది. కాబట్టి వాటికి అవసరమయ్యే ఆస్పరాగస్, పైనాపిల్, పీచ్, కీర దోస, అల్లం మరియు వెల్లుల్లి మీ రోజు వారీ ఆహారంలో భాగంగా తీసుకోండి. వాటితో పాటు మంచి నీటిని ఎక్కువగా తాగండి. దాంతో కూడా యూరిన్ ఫ్రీగా అవుతుంది. వీటిని రోజు పాటించడం వలన పిరియడ్స్ సమస్యలు కలిగే నొప్పులను దూరం చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…