2020 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం రేపు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపిస్తుంది. రేపు ఏర్పడబోయే గ్రహణాన్ని ఉపఛాయ గ్రహణం అని అంటారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజునే చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. చాలా అరుదుగా మాత్రమే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చంద్ర గ్రహణం రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 : 04 గంటలకు గ్రహణం ప్రారంభం కానుండగా సాయంత్రం 5 : 22 గంటలకు గ్రహణం ముగియనుంది. రేపు కనిపించే చంద్రుడు సాధారణంగా కనిపించేంత ప్రకాశవంతంగా కాకుండా కొంచెం మసకగా కనిపిస్తాడు. అయితే ఉపఛాయ చంద్రగ్రహణాన్ని గ్రహణంగా శాస్త్రాల ప్రకారం పరిగణించరు.
అందువల్ల చంద్రగ్రహణం సమయంలో ఆలయ తలుపులను మూసివేయరు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్న సమయంలో భూమి అడ్డుకోవడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
ఈ గ్రహణం వల్ల మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు, వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచు ఉపశమనం, మిధున రాశి వారికి ఖర్చులు తగ్గడం, కర్కాటక రాశి వారికి ఉన్నతాధికారులచే ప్రశంసలు, సింహ రాశివారికి మంచి లాభాలు, కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, తులారాశివారికి సవాళ్లు ఏర్పడటం, వృశ్చికరాశి వాళ్లు జీవిత భాగస్వామి నుంచి మద్దతు, ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు, మకరరాశి వారికి ఆర్థిక ప్రయోజానాలు, కుంభరాశి వారికి పరిస్థితులు మెరుగుపడటం, మీనరాశి వారికి కెరీర్ పరంగా బాధ్యత పెరగడం జరుగుతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…