Hero Nani: సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఏ విధమైనటువంటి అవమానాలు, ఇబ్బందులు లేకుండా అవకాశాలు వస్తాయి.ఇలా అవకాశాలు వచ్చిన తర్వాత వారి టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో కొనసాగడం లేదా ఇండస్ట్రీకి దూరం అవడం అనేది జరుగుతుంది. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఉన్న వారికి అవకాశాలు రావడమే గగనం.
ఇలా అవకాశాల కోసం తిరుగుతూ ఎంతో మంది చేత అవమానాలను, తిరస్కరణలను ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా ఎంతోమంది ఇలాంటి అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు.
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన నాని తర్వాత డైరెక్టర్ గాను అలాగే హీరోగా స్థిరపడి మంచి గుర్తింపు పొందారు.ఇక ప్రస్తుతం ఈయన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మార్చి 30 తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి అవమానాలను చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో కష్టాలను అవమానాలను పడ్డానని తెలిపారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలిసేది కాదని, ఎవరు తనకు చెప్పి సహాయం చేసేవారు కాదని తెలిపారు. అందరిలాగే తాను కూడా కష్టాలను పడ్డానని తెలిపారు. ఇక ఒక డైరెక్టర్ అందరి ముందు సెట్ లో నన్ను దారుణంగా అవమానించారని గుర్తు చేసుకున్నారు. నువ్వు ఈ జన్మకు డైరెక్టర్ కాలేవు అంటూ ఆయన తనని అవమానించారని, అయితే ఆ క్షణం బాధపడిన నాలో మరింత కసి పెంచుకొని నేను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ డైరెక్టర్ అవమానాలే కారణమని నాని తెలిపారు. మరి నానిను అవమానించిన ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.
ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా…
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన ఒక విచిత్ర ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి బంధం మొదలైన తొలి రాత్రే భారీ…
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికు భక్తులు పెద్దఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన…