Kutty Padmini : పాత సినిమా ‘లేతమనసులు’లో పప్పి, లల్లి పాత్రలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా. “పిల్లలు దేవుడు చల్లని వాడే” సాంగ్ వినగానే టక్కున గుర్తొచ్చే ఆ పాప కుట్టి పద్మిని. తమిళనాడుకు చెందిన ఈ నటి తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. తన మూడ ఏటనే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో సక్సెస్ అయినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా రానించలేకపోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడు నుండి అలాగే ఆంధ్ర నుండి ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె నటిగా కొనసాగుతూనే నిర్మాతగాను పలు సినిమాలను సీరియల్స్ ను నిర్మించారు.
అమ్మ, సావిత్రమ్మ మంచి స్నేహితులు…
కుట్టి పద్మిని గారు మూడు నెళ్ల వయసులోనే సినిమాల్లో నటించేసారు. ఆమె తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన తల్లి ఒక పర్షియన్ అంటూ తెలిపారు. తండ్రి అయ్యంగర్. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇక తల్లి రాధ కూడా ఎన్నో సినిమాలలో నటించారు. అలా ఇండస్ట్రీతో పరిచయాలు ఉండటం వలన సావిత్రి గారు మంచి స్నేహితురాలు అంటూ తెలిపారు. తన తల్లి సావిత్రి గారు రోజూ కలిసేవారని, ఒకరోజు సావిత్రి గారు మా అమ్మ రాధతో కలిసి జెమిని గణేశన్ గారి సినిమా షూటింగ్ కి వెళ్లారు.
ఆ సమయంలో నేనింకా మూడు నెలల పసికందు. అయితే షూటింగ్ లో ఎవరు ఎత్తుకుంటున్నా వెళ్లిపోయానట అంటూ కుట్టి పద్మిని చెప్పారు. ఇక జెమిని గణేశన్ గారి సినిమా షూటింగ్ లో ఒక చిన్నారి ఉయ్యాలలో ఉండాలి అయితే షూటింగ్ కని తెచ్చిన పిల్లలు బాగా ఏడ్చే సరికి నన్ను జెమిని గణేశన్ గారు ఎత్తుకుని ఈ పాప అందరి దగ్గర ఉంది తనని షూటింగ్ కి తీసుకుందాం అని చెప్పి అలా సినిమాలో రంగప్రవేశం జరిగిందంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…