అసలే కరోనా మహమ్మారి వల్ల పూర్తిగా ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్నారు జనం. ఇటువంటి పరిస్థితులకలో కూడా కార్పొరేట్ వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు వేస్తున్న బిల్లులు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అసలు ఇటువంటి ఆసుపత్రులపై నియంత్రని లేనట్టుగానే ఉంది పరిస్థితి. తాజగా ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు యంగ్ హీరో. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసాడు హీరో నిఖిల్. కరోనా సమయంలో సోనూ సూద్ అంత కాకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలలో అడిగినవారికి వెంటనే స్పందిస్తూ తన మంచి మనస్సు చాటుకున్నాడు హీరో నిఖిల్.
తాజాగా ఈ ఆస్పత్రి బిల్లులపై స్పందిస్తూ.. ” తాను చాలా మంది పేషెంట్స్ ఆసుపత్రి బిల్స్ చూశానని, వాటిలో చాలా మంది బిల్లులు 10 లక్షల రూపాయలకు పైనే ఉండటం నన్ను ఆశ్చర్యం కలిగించిందని నిఖిల్ పేర్కొన్నారు. పేషెంట్స్ కు బిల్స్ వేయడం విషయంలో కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది ఆసుపత్రి బిల్లులను చెల్లించడంలో తమ బృందం చేతనైనంత సాయం చేస్తున్నట్లు నిఖిల్ తెలిపారు. సాధారణ సర్జరీలకు కూడా మన లోకల్ ఆసుపత్రులు అంతంత బిల్స్ ఎందుకు వేస్తున్నాయి? వీటిని నియంత్రించేది వారు లేరా? అంటూ నిఖిల్ ఆవేదన చెందుతూ ట్వీట్ చేశారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…