అసలే కరోనా మహమ్మారి వల్ల పూర్తిగా ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్నారు జనం. ఇటువంటి పరిస్థితులకలో కూడా కార్పొరేట్ వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు వేస్తున్న బిల్లులు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అసలు ఇటువంటి ఆసుపత్రులపై నియంత్రని లేనట్టుగానే ఉంది పరిస్థితి. తాజగా ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు యంగ్ హీరో. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసాడు హీరో నిఖిల్. కరోనా సమయంలో సోనూ సూద్ అంత కాకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలలో అడిగినవారికి వెంటనే స్పందిస్తూ తన మంచి మనస్సు చాటుకున్నాడు హీరో నిఖిల్.
తాజాగా ఈ ఆస్పత్రి బిల్లులపై స్పందిస్తూ.. ” తాను చాలా మంది పేషెంట్స్ ఆసుపత్రి బిల్స్ చూశానని, వాటిలో చాలా మంది బిల్లులు 10 లక్షల రూపాయలకు పైనే ఉండటం నన్ను ఆశ్చర్యం కలిగించిందని నిఖిల్ పేర్కొన్నారు. పేషెంట్స్ కు బిల్స్ వేయడం విషయంలో కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది ఆసుపత్రి బిల్లులను చెల్లించడంలో తమ బృందం చేతనైనంత సాయం చేస్తున్నట్లు నిఖిల్ తెలిపారు. సాధారణ సర్జరీలకు కూడా మన లోకల్ ఆసుపత్రులు అంతంత బిల్స్ ఎందుకు వేస్తున్నాయి? వీటిని నియంత్రించేది వారు లేరా? అంటూ నిఖిల్ ఆవేదన చెందుతూ ట్వీట్ చేశారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…