నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాల పేర్లు వినిపిస్తే లవర్ బాయ్ సిద్దార్థ్ మన కళ్ల ముందు మెదులుతాడు. తెలుగులో ఈ రెండు సినిమాలు మినహా పెద్దగా సక్సెస్ లు లేని సిద్దార్థ్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు అభిమానిస్తారు. అయితే ఒకప్పుడు హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన సిద్దార్థ్ గత కొన్నేళ్లుగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
అయితే తాజాగా సిద్దార్థ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మహాసముద్రం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏడేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కిన బాద్ షా సిద్దార్థ్ చివరగా తెలుగులో నటించిన స్ట్రెయిట్ సినిమా. తమిళంలో సిద్దార్థ్ నటించిన సినిమాలే తెలుగులో డబ్ అవుతూ ఉండటంతో ప్రేక్షకులు లవర్ బాయ్ సిద్దార్థ్ ను ఇంకా మరిచిపోలేదు.
ఆర్.ఎక్స్.100 సినిమాతో తొలి సినిమాతోనే అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సిద్దార్థ్ కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. అజయ్ భూపతి రవితేజతో మహాసముద్రం సినిమాను తెరకెక్కించాలని భావించినా కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే సిద్దార్థ్ ఎంట్రీతో ఈ సినిమా నుంచి సమంత ఎగ్జిట్ అయిందని తెలుస్తోంది.
గతంలో సిద్దార్థ్, సమంత ఒకరినొకరు ప్రేమించుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. శ్రీకాళహస్తిలో సామ్, సిద్దార్థ్ పూజలు చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అకస్మాత్తుగా సిద్దార్థ్ సామ్ విడిపోగా అనంతరం నాగచైతన్య సామ్ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే సిద్దార్థ్ మహాసముద్రం సినిమాలో నటించడం ఇష్టం లేని సామ్ తనంతట తాను తప్పుకుందని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…