తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా హీరో శింబు కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఎలాంగో సలై రోడ్ లో మార్చి 18వ తేదీ రాత్రి 7 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల వృద్దుడు మృతి చెందాడు..
శింబు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. కాగా ఈ ప్రమాదం సమయంలో కారులో శింబు తండ్రి డైరెక్టర్ టి రాజేందర్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే టి. రాజేందర్ వృద్దుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయిన వృద్దుడు వికలాంగుడని అతను రోడ్డు పై పాకుకుంటూ వెళ్తుండటం కారులో ఉన్న డ్రైవర్ కు కనిపించలేదని చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన డ్రైవర్ సెల్వంను అక్కడి పోలీసులు అరెస్టు చేసారు. ఆపై జుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే తాజాగా ప్రమాదం జరిగిన చోట ఉన్న ఒక నివాసంలోCCTV కెమెరాల ఫూటేజ్ సేకరిచారు పోలీసులు ఇప్పుడు అది బయటకు రావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…