తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా హీరో శింబు కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఎలాంగో సలై రోడ్ లో మార్చి 18వ తేదీ రాత్రి 7 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల వృద్దుడు మృతి చెందాడు..
శింబు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. కాగా ఈ ప్రమాదం సమయంలో కారులో శింబు తండ్రి డైరెక్టర్ టి రాజేందర్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే టి. రాజేందర్ వృద్దుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయిన వృద్దుడు వికలాంగుడని అతను రోడ్డు పై పాకుకుంటూ వెళ్తుండటం కారులో ఉన్న డ్రైవర్ కు కనిపించలేదని చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన డ్రైవర్ సెల్వంను అక్కడి పోలీసులు అరెస్టు చేసారు. ఆపై జుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే తాజాగా ప్రమాదం జరిగిన చోట ఉన్న ఒక నివాసంలోCCTV కెమెరాల ఫూటేజ్ సేకరిచారు పోలీసులు ఇప్పుడు అది బయటకు రావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…