తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా హీరో శింబు కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఎలాంగో సలై రోడ్ లో మార్చి 18వ తేదీ రాత్రి 7 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల వృద్దుడు మృతి చెందాడు..
శింబు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. కాగా ఈ ప్రమాదం సమయంలో కారులో శింబు తండ్రి డైరెక్టర్ టి రాజేందర్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే టి. రాజేందర్ వృద్దుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయిన వృద్దుడు వికలాంగుడని అతను రోడ్డు పై పాకుకుంటూ వెళ్తుండటం కారులో ఉన్న డ్రైవర్ కు కనిపించలేదని చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన డ్రైవర్ సెల్వంను అక్కడి పోలీసులు అరెస్టు చేసారు. ఆపై జుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే తాజాగా ప్రమాదం జరిగిన చోట ఉన్న ఒక నివాసంలోCCTV కెమెరాల ఫూటేజ్ సేకరిచారు పోలీసులు ఇప్పుడు అది బయటకు రావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…