Heroin Ramba : సినిమా పరిశ్రమ అంతా ఒక బూటకం అని చెప్పాలి. పైకి సినిమా రూపంలో అందంగా… గ్రాండ్ గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మోసాలు, కుట్రలు ఉంటాయి. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక మంచి మనసున్న కమెడియన్ కు మరియు స్టార్ హీరోయిన్ కు మధ్య జరిగిన కథ మరియు ఏ విధంగా ఆ కమెడియన్ ఆ హీరోయిన్ చేతిలో దారుణంగా మోసపోయాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు హీరోయిన్ రంభ ఒక వెలుగు వెలిగింది. ఈమె తెలుగులో ఎక్కువగా చిరంజీవి మరియు జి డి చక్రవర్తి లతోనే సినిమాలు చేసింది. తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బాగా సంపాదించింది. అయితే ఆమె కెరీర్ మొదట్లో సినిమా షూటింగ్ కు తరచూ చెన్నై వస్తూ ఉండేది. అయితే షూటింగ్ ఉన్న రోజులలో ఎక్కడ ఉండాలో తెలియక చాలా ఇబ్బంమధులు పడేదట. అయితే రంభ పడే కష్టాలను చూడలేని తమిళ కమెడియన్ గౌండమణి స్పందించి తనతో మాట్లాడి తనకు అప్పటికే ఉన్న ఇళ్లలో ఒక ఇంటిని తాను ఉండడానికి ఏర్పాటు చేశాడట.
అలా రంభ ఎప్పుడు షూటింగ్ కు వచ్చినా ఆయా ఇంట్లో ఉంటూ వెళుతూ హ్యాపీగా ఉండేది. అయితే కాలం జరుగుతున్న కొద్దీ రంభకు క్రేజ్ పెరిగింది. మరియు సినిమాలు కూడా బాగా వస్థుండడంతో చూస్తుండగానే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అదే సమయంలో ఇండస్ట్రీలో అప్పుడప్పుడే వస్తున్న కమెడియన్ ల నుండి పోటీ తట్టుకోలేక సినిమాలు లేక చాలా ఇబ్బందుల్లో పడ్డాడట గౌండమణి.
ఎంత ఇబ్బందులు అంటే కనీసం ఒకపూట తిండికి కూడా ఇబ్బంది పడే స్థితి. దానితో తాను ఒకప్పుడు ఆదరించిన రంభ దగ్గరకు సాయం కోసం వెళ్ళాడట. అయితే రంభ మాత్రం ఎటువంటి సాయం చేయలేదట. కనీసం తాను ఉంటున్న ఇంటిని పెట్టుకుని కొంత డబ్బు అయినా ఇమ్మని అడిగాడట. అందుకు రంభ ఇది నీ ఇల్లు కాదు నాది.. నీకు కావాలంటే అప్పుగా కొంత డబ్బు ఇస్తాను అని సాయం పొందిన మనిషినే నిలువునా దారుణంగా మాట్లాడి పంపేసింది. దీనితో గౌండమణి చాలా బాధపడ్డాడు. ఇలా రంభం చేతిలో గౌండమణి మోసపోయాడు. ఇదొక్కటి మాత్రమే కాదు మనకు తెలియని, బయటకు రాని చాలా మోసాలు కళామతల్లి గుండెల్లోనే పెట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…