Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ, సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
నా ముందే అతను మంటల్లో కాలిపోయాడు…
ఆమని గారికి హీరోయిన్స్ లో సౌందర్య గారంటే చాలా ఇష్టం. తనతో చాలా సన్నిహితంగా ఉండేవారట. ఇద్దరూ వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేవారట. అలాంటి ఆమని సౌందర్య మరణించినపుడు చూడటానికి వెళ్ళలేదు. దానికి కారణం మంటల్లో కాలిపోయిన వారిని చూసి తట్టుకునే శక్తి లేకపోవడం. ఇందుకు కారణం ఆమె సినిమాలో హీరోయిన్ గా చేసే సమయంలో ఒక సినిమా డ్యూయెట్ సాంగ్ చిత్రీకరణ అప్పుడు నిప్పు మధ్యలో డాన్స్ చేసే సీన్ డిజైన్ చేశారట. ఆ సినిమాలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న లోకనాథ్ గారు క్రేన్ సహాయంతో పైన నిల్చొని సీన్ తీస్తూ మంట సరిపోలేదని కిందకు వచ్చి పెట్రోల్ తానే తీసుకుని అక్కడున్న బండల మీద చల్లుతుండగా అప్పటికి ఆ బండలపై నిప్పులేకపోయినా ఎక్కడో ఒక రవ్వ ఉండటంతో అది అంటుకుని రివెర్స్ లో ఆయన వైపుకు వచ్చిందట.
ఆ సమయంలో ఆయన చెంబులో ఉన్న పెట్రోల్ తన మీదే పోసుకోవడంతో నిప్పు అంటుకుని కాలిపోయాడు. అక్కడే చూస్తూ ఉన్న అందరూ ఏమి చేయలేకపోయారట. అది ప్రత్యక్షంగా చూసిన ఆమని గారికి అప్పటి నుండి నిప్పుల్లో కాలిన వారిని చూడాలంటే భయమట. లోకనాథ్ గారు దాదాపు 15 రోజులు హాస్పిటల్ లో చికిత్స అందుకుంటూ మరణించారట. హాస్పిటల్ వద్దకు వెళ్లి ఆయన భార్యను కలిసి వచ్చేదాన్ని కానీ ఆయనను చూసే ధైర్యం చేయలేక పోయేదాన్ని, ఒక ఆరు నెలలు ఆయన కాలిపోయిన సంఘటన గుర్తొచ్చి భయపడేదాన్ని అంటూ అందుకే సౌందర్య మరణించినపుడు కూడా వెళ్ళలేదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…