క్రికెటర్ తో రిలేషన్లో ఉన్న రాశీఖన్నా.. నిజమెంత?

మద్రాస్‌ కేఫ్‌ అనే చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. తొలిసినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. తర్వాత అతడి రెండో సినిమాను తెలుగులో నటించింది. అది కూడా మనం చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. మూడో చిత్రంతో ఆమె ఫుల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది.

2014లో ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో తన క్యూట్‌ నటన, అందంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం జోరు పెంచిన ఈ చిన్నది వరుస సినిమాల్లో నటిస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన రాశీ ఖన్నీ. ఆయితే ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో ఆమె ఎప్పిటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పోస్టు చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె మొదటి సనిమా మద్రాస్ కేఫ్ కు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఆమె లాంగ్ ఇయర్ రింగ్స్, ఓపెన్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆమె ఫొటోలకు విపరీతంగా లైక్ లు వస్తున్నాయి.

ఆ చిత్రాలకు దాదాపు 3 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. ఇక ఆమె వ్యక్తిగత సినిమాకు వస్తే.. భారత్ క్రికెటర్ జస్ప్రీత్‌ బుమ్రాతో ప్రేమాయణం నడిపారని మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. 2018 లో ఆమె అతడితో డేటింగ్ చేశారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఈ మధ్య స్పందిస్తూ.. అతడు కేవలం క్రికెటర్ గా మాత్రమే తెలుసు అని చెప్పింది. తాజాగ ఆమె అతడితో ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది.