Heroine Rakul Preeth Singh : ‘వెంకటాద్రి ఎక్ప్రెస్స్’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేసినా ఆ తరువాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరితో నటించిన ముద్దుగుమ్మ అటు పక్క భాషలలోనూ నటిస్తూ తమిళంలో కూడా అగ్రహీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఇక సౌత్ లో బాగా ఫేమస్ అయ్యాక అమ్మడి చూపు మరోసారి బాలీవుడ్ పైన పడింది. చిన్న హీరో సినిమా అయినా బాలీవుడ్ లో పాతుకుపోవాల్సిందే అనుకుని పాపం రకుల్ ఇక్కడ సినిమాలను వద్దనుకుని ముంబై చెక్కేసింది. అయితే తెలుగులో ప్రస్తుతం సినిమాలను చేయకపోయినా హైదరాబాద్ లోనే ఇల్లు కొనుక్కుని ఇక్కడే ఉంటున్న రకుల్ వేళ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించింది..?
రెమ్యూనరేషన్ తక్కువే… అయినా ఎన్నో జిమ్ సెంటర్స్…
మధ్య తరగతి కుటుంబానికి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అవ్వక ముందు నుండే తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల ఫిట్ నెస్ మెయింటైన్ చేసేది. అలా హీరోయిన్ అయిన కొద్ది కాలానికే హైదరాబాద్ వైజాగ్ వంటి సిటీస్ లో ‘ఎఫ్ 45’ అనే పేరుతో అత్యాధునిక జిమ్ సెంటర్స్ ఓపెన్ చేసింది రకుల్. అయితే ఒక వైపు సినిమాలను చేస్తూ మరో వైపు వ్యాపారం ఇవన్నీ ఎలా మైంటైన్ చేస్తోంది అంటే రకుల్ ప్రీత్ వెనుక తెలంగాణ కు చెందిన ఒక రాజకీయ ప్రముఖుడి అండదండలు ఉన్నాయి అనే పుకార్లు ఉన్నాయి.
అందుకే అమ్మడు ముంబై నుండి మకాం హైదరాబాద్ కు మార్చేసిందని టాక్. తెలుగులో సినిమాలను చేస్తున్నపుడు ముంబై, ఢిల్లీ లో ఉన్న రకుల్ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలను చేస్తూ హైదరాబాద్ లో ఉంటోంది. ప్రస్తుతం తెలుగులో సినిమాల్లేవు కానీ బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లను చేస్తోంది. ఇక బాలీవుడ్ లో రకుల్ కి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. జిమ్ లలో ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ జక్కి భజ్ఞాని తో హల్చల్ చేస్తుంటుంది రకుల్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…