రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. క్రేజీ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారు రష్మిక. మొదటి సినిమాతో గ్లామర్ రోల్ గా చేసి సత్తా చాటింది.
అయితే సినీ పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ వస్తే చాలు.. వివిధ బ్రాండ్ లకు అంబాసిడర్ గా నిలబడతారు. ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఇలానే జరుగుతోంది. అయితే రష్మిక కూడా వివిధ రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహిరిస్తోంది. తాజాగా రష్మిక పురుషుల అండర్ వేర్ బ్రాండ్ మాకో ప్రకటనలో మెరిచింది. ఈ ప్రకటనలో ఆమె విక్కీ కౌశల్తో కలిసి నటించింది.
ఈ యాడ్లో రష్మిక విక్కీ కౌశల్ అండర్ వేర్ పట్టీని చూస్తూ ఉండటం గమనించవచ్చు. దీంతో ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటన స్టాండర్డ్ తక్కువగా ఉండి సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రష్మిక మీ నుంచి ఇలాంటి ప్రకటనను ఊహించలేదు.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అంతగా చూడాలనుకుంటే ఒకటి కొనుక్కోవచ్చుగా అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. డబ్బుల కోసమే ఆమె యాడ్ లో నటించింది. కానీ అది మరీ ఈ రకంగా ఉండడంతో ఆమెకి విమర్శలు తప్పడం లేదు.
జాతీయస్థాయిలో ప్రమోట్ అయ్యే బ్రాండ్ ఒప్పుకుంటే తన గ్రాఫ్ పెరిగినట్లే అనేది ఆమె ఆలోచన. అందుకే , తనని తాను బాలీవుడ్ లో బాగా ప్రోమోట్ చేసుకుంటోంది. ఆమె ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోతో యాడ్ కూడా చెయ్యడం అంటే ఆమె పాపులారిటీ పెరిగినట్లే. అందుకే రష్మిక విక్కీ కౌశల్తో నటించటంపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. వీరి కలయికలో సినిమా కూడా రావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…