బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా రన్ అవుతోంది. మూడు వారాలు పూర్తి చేసుకొని.. ముగ్గురిని బయటకు పంపించి ఇక మిగిలిన 16 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం హౌస్ నడుస్తోంది. ఇప్పటికే లావుతగ్గాల్సిందే అన్న టాస్క్ లో భాగంగా ఇద్దరు కలిసి ఒక జంటగా ఏర్పడి టాస్క్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో లావు తగ్గాలన్నా కాన్సెప్ట్ తో మొదట టాస్క్ మొదలైన విషయం కూడా విధితమే.
ఇందులో ఇప్పటికే ఆకలికి తట్టుకోలేక చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా లోబో పరిస్థితి చూస్తే.. చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. ఈ టాస్క్ లో భాగంగానే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులను ఆకలితో అలమటించేలా చేశాడు. ఆకలి బాధ అంటే ఎంటో ఇంట్లో సభ్యులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. ఆకలి బాధను తట్టుకుని ఎవరు నిలబడతారో పరీక్షించాడు.
మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ఇంటి సభ్యులకు ఫుడ్ కట్ చేసి.. ఆకలి బాధ అంటే ఎంటో రుచి చూపించాడు. ఇలా టాస్క్ ల మధ్యలో అప్పుడప్పుడు ఫుడ్ పంపించి అందులో ఉన్న వారికి కాస్త ఆకలి తీరుస్తున్నాడు. దీనిని చూస్తుంటే నిన్న చాలామంది ఆకలితో అలమటించినట్లు అనిపించింది. ఇదంతా ఇలా ఉండగా.. నటరాజ్ మాస్టర్ టీంలో ఉన్న లోబో ఆకలికి తట్టుకోలేక.. చెత్త కవర్లో దాచి పెట్టిన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేశాడు..ఎవరూ చూడకుండా అందులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు.
అయితే ఆ విషయాన్ని రవి పసిగట్టి.. రేయ్ ఏం చేస్తున్నావ్ రా అని వారించాడు. అయితే సీన్ చూసిన నటరాజ్ మాస్టర్ ఇలా చేయొద్దు నేను గేమ్ వదిలేస్తున్నా నువ్ తినెయ్ అని చెప్పాడు. ఇది బయట నుంచి చూసిన ప్రేక్షకులకు ఎంతో బాధ వేసింది. ఇలాంటి టాస్క్ లు పెట్టకుండా ఉండటమే మంచిది అంటూ బిగ్ బాస్ ను నెటిజన్లు వేడుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…