Featured

Heroine Shanthi Priya : భర్త చనిపోయాక కష్ట సుఖాలు పంచుకోడానికి ఎవరూ లేరు…: హీరోయిన్ శాంతి ప్రియ

Heroine Shanthi Priya : హీరోయిన్ భాను ప్రియ చెల్లెలుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శాంతి హీరోయిన్ అయ్యాక తెలుగులో శాంతి ప్రియగా తమిళంలో నిశాంతి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా మొదటి సినిమా ‘మహర్షి’ వల్ల బాగా ఫేమస్ అయింది. మహర్షి సినిమాలోని పాత్రకు ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఉండటం విశేషం. హిందీ నటుడిని పెళ్లి చేసుకుని ముంబై లో సెటిల్ అయిన శాంతి ప్రియ కు ఇద్దరు కొడుకులు. సినిమాలకు ఎపుడో గుడ్ బై చెప్పిన శాంతి, తాజాగా ధారావి బ్యాంకు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ముంబై లో తన ఇద్దరు కుమారులతో శాంతి జీవిస్తున్నారు.

భర్త చనిపోయాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా…

శాంతి ప్రియ గారు మరాఠి, హిందీ నాటుడైన సిధార్థ రే ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సిద్దార్థ్ రే కి సుశాంత్ రే అనే మరో పేరు కూడా ఉంది. హిందీ లో వచ్చిన బాజీఘర్ వంటి సినిమాలతో ఆయన బాగా ఫేమస్. ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్స్ లో కలిసినపుడు శాంతి గారికి సిద్ధార్థ్ గారికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ రే తాతగారు వి.శాంతారామ్ గారు అలాగే తండ్రి ప్రసిద్ధ ఆర్థిక వేత్త సుబ్రతో రే. సిద్ధార్థ రే శాంతి ప్రియ గారికి ఇద్దరు కుమారులు కాగా 2004 లో నలభై ఏళ్ల వయసులో సిద్ధార్థ్ కన్నుమూశారు.

ఇక శాంతి ప్రియ గారు భర్త మరణించాక జీవితం ఎలా మారిపోయింది తాను ఎలా అయిపోయననే విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతవరకు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపిన శాంతి గారికి భర్త మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లారట. ఇక పిల్లలను తానే పెంచి పెద్ధ చేయాలి అన్నపుడు తన తల్లే గుర్తుకు వచ్చిందని తన తల్లి కూడా ఒంటరిగా చెన్నై వచ్చి నన్ను, అక్కను, అన్నను పెంచి ఇక్కడదాకా తెచ్చినపుడు నేను నా పిల్లలను పెంచలేనా అనిపించింది. అయన లేకపోయినా పిల్లలకు ఏ లోటు లేకుండా పెంచాలని నిర్ణయించుకుని ముంబై లోనే ఉండి బ్రతకాలని అనుకున్నాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

15 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

15 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

16 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

16 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

18 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

18 hours ago